Karnataka DGP | కర్ణాటక డీజీపీ రాసలీలలు.. సోషల్​ మీడియాలో వీడియోలు వైరల్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka DGP | కర్ణాటకలో డీజీపీ రాసలీలలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆఫీస్​లోనే ఆయన పలువురు మహిళలతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో (social media) వైరల్ అవుతున్నాయి. సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అధిపతిగా ఉన్న డీజీపీ రామచంద్రరావు (DGP Ramachandra Rao) కొనసాగుతున్నారు. ఆయన తన కార్యాలయంలో ముగ్గురు మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. యూనిఫామ్​లో ఉండి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డట్లు అందులో ఉంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka DGP | కర్ణాటకలో డీజీపీ రాసలీలలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆఫీస్​లోనే ఆయన పలువురు మహిళలతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో (social media) వైరల్ అవుతున్నాయి.

సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అధిపతిగా ఉన్న డీజీపీ రామచంద్రరావు (DGP Ramachandra Rao) కొనసాగుతున్నారు. ఆయన తన కార్యాలయంలో ముగ్గురు మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. యూనిఫామ్​లో ఉండి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డట్లు అందులో ఉంది. కాగా డీజీపీ రామచంద్రరావు గతంలో తన సవతి కుమార్తె రాన్యా రావుకు బంగారు స్మగ్లింగ్ కేసులో సహాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ కేసుతో ఆయనను ప్రభుత్వం గతంలో సెలవుపై పంపింది. ఇటీవల ఆ తప్పనిసరి సెలవు ఉత్తర్వును రద్దు చేసి ఆయన్ను సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా బదిలీ చేసింది.

Karnataka DGP | విచారణకు ఆదేశం

రామచంద్రారావు రాసలీలల వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వరకు చేరింది. దీంతో ఆయన ఈ వీడియోలపై విచారణకు ఆదేశించారు. వీటిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక అధికారి ఇలా కార్యాలయంలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Karnataka DGP | స్పందించిన డీజీపీ

వీడియోలు వైరల్ కావడంతో డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఆ వీడియోలు తనవి కావని చెప్పారు. ఏఐతో సృష్టించారన్నారు. ఇదంతా ఫేక్.. తనకే షాకింగ్‌గా ఉందన్నారు. ఆ వీడియోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో తనకేమి తెలియదన్నారు. అసలు జరిగి ఉంటే కదా అన్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన హోంమంత్రి పరమేశ్వరను కలిసి వివరించారు. తన ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్రగా ఆయన ఈ సంఘటనను అభివర్ణించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...