Kaleshwaram Commission | కేసీఆర్​కు కాళేశ్వరం కమిషన్​ నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ Kaleshwaram Commission విచారణలో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్​ కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్​కు former cm kcr నోటీసులు ఇచ్చింది. కేసీఆర్​తో పాటు అప్పుడు మంత్రులుగా పని చేసిన హరీశ్​రావు harish rao, ఈటల రాజేందర్ etala rajendar​కు నోటీసులు పంపింది. ఆ సమయంలో హరీశ్​రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్​ ఆర్థిక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ Kaleshwaram Commission విచారణలో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్​ కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్​కు former cm kcr నోటీసులు ఇచ్చింది. కేసీఆర్​తో పాటు అప్పుడు మంత్రులుగా పని చేసిన హరీశ్​రావు harish rao, ఈటల రాజేందర్ etala rajendar​కు నోటీసులు పంపింది. ఆ సమయంలో హరీశ్​రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.

Kaleshwaram Commission | అందుకోసమే గడువు పొడిగింపు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ​Kaleshwaram project లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ ఘోష్ justice gosh కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​ ఇప్పటికే అప్పటి ఈఎన్​సీలను, కీలక అధికారులను, పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులను విచారించింది. ఈ క్రమంలో విచారణ పూర్తయి నివేదిక ప్రభుత్వానికి అందించే తరుణంలో ప్రభుత్వం కమిషన్​ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కమిషన్​ తాజాగా కేసీఆర్​, హరీశ్​రావు, ఈటలకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

Kaleshwaram Commission | కేసీఆర్​ చెప్పినట్లే చేశాం..

బీఆర్​ఎస్​ brs హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మించిన విషయం తెలిసిందే. తానే దగ్గరుండి ప్రాజెక్ట్​ పనులు చేపట్టినట్లు మాజీ సీఎం కేసీఆర్​ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఇదే విషయాన్ని అధికారులు సైతం కమిషన్​ ఎదుట చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్ట్​ డిజైన్​ మార్పు, బ్యారేజీల ఖరారు, నీటి నిల్వ సామర్థ్యం విషయంతో కేసీఆర్ ​సూచించిన విధంగానే తాము చేసినట్టు వారు చెప్పారని సమాచారం. దీంతోనే కమిషన్​ ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Kaleshwaram Commission | వివరణ తీసుకోవడం కోసం..

కేసీఆర్​ చెప్పినట్లే ప్రాజెక్ట్​లో మార్పులు చేశామని అధికారులు చెప్పడంతో కమిషన్​ ఆ మేరకు నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. ప్రాజెక్ట్​ కుంగుబాటు, అక్రమాలకు కేసీఆరే కారణమని నివేదిక రూపొందించినట్లు సమాచారం. అయితే ఆయన వివరణ తీసుకోకుండా ఆయనను దోషిగా పేర్కొనడం సరికాదని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

Kaleshwaram Commission | విచారణకు హాజరు అవుతారా..

కాళేశ్వరం కమిషన్​ కేసీఆర్​కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో విద్యుత్​ కమిషన్​ విచారణకు కేసీఆర్​ హాజరు కాలేదు. తనను విచారించే అధికారం కమిషన్​కు లేదని కేసీఆర్​ కోర్టుకు వెళ్లి విజయం సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు కాళేశ్వరం విచారణకు హాజరు అవుతారా.. లేక మళ్లీ కోర్టుకు వెళ్తారా అనేది చూడాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...