Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: kaleshwaram | కాళేశ్వరం విచారణ కమిషన్ (Kaleshwaram inquiry mommission) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుందనే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: kaleshwaram | కాళేశ్వరం విచారణ కమిషన్ (Kaleshwaram inquiry mommission) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుందనే ప్రచారం జరుగుతున్న వేళ రెండు నెలల పాటు గడువు పొడిగించడం ఆసక్తికంగా మారింది. కాగా.. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ సాగుతోంది.

kaleshwaram | పొడిగింపు అందుకేనా..!

పీసీ ఘోష్ కమిషన్ (PC ghosh commission) పదవీ కాలం పెంపుతో మళ్లీ విచారణ ఇంకా కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్​ను విచారించడం కోసం కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారనే చర్చ సాగుతోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...