ePaper
More
    HomeజాతీయంKaleshwaram | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

    Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kaleshwaram | కాళేశ్వరం విచారణ కమిషన్ (Kaleshwaram inquiry mommission) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుందనే ప్రచారం జరుగుతున్న వేళ రెండు నెలల పాటు గడువు పొడిగించడం ఆసక్తికంగా మారింది. కాగా.. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ సాగుతోంది.

    kaleshwaram | పొడిగింపు అందుకేనా..!

    పీసీ ఘోష్ కమిషన్ (PC ghosh commission) పదవీ కాలం పెంపుతో మళ్లీ విచారణ ఇంకా కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్​ను విచారించడం కోసం కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారనే చర్చ సాగుతోంది.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...