Homeజిల్లాలుజోగులాంబ గద్వాల్Jurala Project | ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్​.. పరిశీలించనున్న మంత్రి

Jurala Project | ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్​.. పరిశీలించనున్న మంత్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా(Gadwal District)లో గల జూరాల ప్రాజెక్ట్​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. కొన్ని రోజులుగా జలాశయానికి వరద కొనసాగుతుండడంతో.. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న నీటిని వదర గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. అయితే గేట్లు ఎత్తే సమయంలో పలు రోప్​లు తెగిపోవడంతో ప్రాజెక్ట్ భద్రతపై ఆందోళన నెలకొంది.

Jurala Project | తెగిపోయిన రోప్​లు

జూరాల ప్రాజెక్ట్(Jurala Project ) గేట్లు ఎత్తడంతో గురువారం తొమ్మిదో నంబర్​గేటు రోప్​ తెగిపోయింది. మరోవైపు తాజాగా 31 నెంబర్‌ గేట్‌ ఐరన్‌ రోప్‌లు(Iron ropes) తెగిపోయాయి. 8వ గేటుకు సైతం రెండు రోప్​లు తెగిపోయాయి. 4వ గేటుకు రెండువైపులా ఒక్కో ఐరన్ రోప్‌ తెగిపోయింది. మరో ఐదు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఆయా గేట్లను ఎత్తడం వీలయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్ట్​ భద్రతపై దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, ఆయకట్టు రైతులు(Formers) ఆందోళన చెందుతున్నారు.

Jurala Project | పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్​

జూరాల ప్రాజెక్ట్​ వరద గేట్ల రోప్​లు తెగిపోవడంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి(Minister Uttam Kumar Reddy) శనివారం పరిశీలించనున్నారు. నేడు ఆయన ప్రాజెక్ట్​ను సందర్శించి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా జూరాల ప్రాజెక్ట్​కు ఇటీవల వేసవిలో మరమ్మతులు చేపట్టారు. అయినా గేట్ల రోప్​లు తెగిపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jurala Project | జూరాల ఎంతో కీలకం

కృష్ణానదిపై తెలంగాణ(Telangana)లో ఉన్న తొలి ప్రాజెక్ట్​ జూరాల. దీనిని గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం దగ్గర నిర్మించారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ప్రాజెక్ట్​ నిర్మాణం ప్రారంభించగా.. 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దశ నీటిని విడుదల చేసి ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. 9.8 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్​కు 62 గేట్లు ఉన్నాయి.
ప్రాజెక్టు కుడి కాల్వను సోమనాద్రి కాలువగా పిలుస్తారు.

ఈ కాలువ ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాల్వగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా  ఆత్మకూరు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అంతేగాకుండా ఈ ప్రాజెక్ట్​ దగ్గర విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా కూడా జలాశయం మారింది. ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్​ గేట్లను అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News