Election Commission | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఖర్చులపై ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం.. టీ నుంచి బిర్యానీ వరకూ ఖర్చులకు లెక్క తప్పదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లో జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చేసే ప్రచార వ్యయాలపై ఎన్నికల సంఘం(Election Commission) ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. వ్యయాల్లో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ఖర్చుల అంశానికి ఖచ్చితమైన ధరలు కూడా నిర్ణయించారు. ఈ ధరల జాబితాను శుక్రవారం విడుదల చేస్తూ, ఇకపై అభ్యర్థులు టీ తాగించినా, భారీ సభలు నిర్వహించినా ప్ర‌తి పైసాకు కూడా లెక్క చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లో జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చేసే ప్రచార వ్యయాలపై ఎన్నికల సంఘం(Election Commission) ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. వ్యయాల్లో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ఖర్చుల అంశానికి ఖచ్చితమైన ధరలు కూడా నిర్ణయించారు.

ఈ ధరల జాబితాను శుక్రవారం విడుదల చేస్తూ, ఇకపై అభ్యర్థులు టీ తాగించినా, భారీ సభలు నిర్వహించినా ప్ర‌తి పైసాకు కూడా లెక్క చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం, అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చులను తప్పకుండా నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Election Commission | లెక్క చెప్పాల్సిందే..

అభ్యర్థులు తమ ఖర్చులను తక్కువ చేసి చూపకుండా నిరోధించే క్ర‌మంలో ఈ ధరల పట్టికను రూపొందించినట్లు స్ప‌ష్టం చేశారు. అధికారుల ప్రకారం, ఇకపై ఓ సింగిల్ టీకి Tea రూ.5, పెద్ద కప్పు టీకి రూ.10గా నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. అలాగే ప్లేట్ ఇడ్లీ (నాలుగు ఇడ్లీలతో) ధర రూ.20, ఒక సమోసా రూ.10గా ఖరారు చేశారు. వెజ్ బిర్యానీ (750 గ్రాములు) ధర రూ.115, చికెన్ బిర్యానీ రూ.170, మటన్ బిర్యానీ రూ.180గా నిర్ణయించారు. కార్యకర్తలకు అందించే నీటి ప్యాకెట్‌కు రూ.2, ఒక లీటర్ వాటర్ బాటిల్‌కు రూ.20గా ఖర్చు చూపాలి.

ప్రచారంలో వినియోగించే వేదికలు, ఫంక్షన్ హాళ్లకూ ఖచ్చితమైన ధరలు కేటాయించారు. మినీ ఫంక్షన్ హాల్‌కు రోజుకు రూ.6,200, పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్‌కు రూ.1,25,000గా ధరను నిర్ణయించారు. అలాగే డ్రోన్ కెమెరా(Drone Camera) వినియోగానికి 12 గంటలకే రూ.5,000గా ఖర్చు నమోదు చేయాల్సి ఉంటుంది. కుర్చీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, టీ షర్టులు, మైకులు, సౌండ్ సిస్టమ్స్ వంటి ప్రచార సామాగ్రికి కూడా ప్రత్యేక ధరలు ఈ జాబితాలో పేర్కొన్నారు.ఈ చర్యలతో అభ్యర్థుల ప్రచార వ్యయాలపై పక్కా పర్యవేక్షణ ఉండనుంది. ఎన్నికల క్రమశిక్షణను మరింత బలపరిచే దిశగా ఈ చర్యలు వేగంగా అమలవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...