RBI Jobs | పదో తరగతితో ఆర్‌బీఐలో ఉద్యోగాలు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Jobs | పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టు (Office Attendant Posts)ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చర్యలు చేపట్టింది. 572 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి. భర్తీ చేసే పోస్టు పేరు : […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Jobs | పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టు (Office Attendant Posts)ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చర్యలు చేపట్టింది. 572 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టు పేరు : ఆఫీస్ అటెండెంట్.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 572.
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతన వివరాలు :

ప్రారంభ వేతనం నెలకు బేసిక్ పే, అలవెన్సులు కలిపి రూ.46,029 వరకు లభిస్తుంది.

దరఖాస్తు రుసుము : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 450(జీఎస్టీ అదనం) దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మిగతావారు రూ. 50(జీఎస్టీ అదనం) చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 04.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష తేదీలు : ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు ఉండే అవకాశాలున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...