అక్షరటుడే, వెబ్డెస్క్: Reliance Jio | ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న టెలికాం సంస్థల్లో ఒకటైన రిలయన్స్ జియో, మరోసారి వినూత్న ఆవిష్కరణతో టెక్నాలజీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 వేదికగా, భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టిన ‘జియోభారత్’ సేఫ్టీ-ఫస్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ఫోన్ల ప్రారంభ ధర కేవలం రూ.799 మాత్రమే!.
Reliance Jio | బాధ్యతాయుత భద్రత ఫీచర్లు
‘జియోభారత్’ ఫోన్లు(Jio Bharat Phones) డిజైన్ చేయడంలో జియో చూపించిన దృష్టి వర్ణనాతీతం. ఈ ఫోన్లలో ఉన్న కీ ఫీచర్లు ఇవే:
లొకేషన్ ట్రాకింగ్ : ఫోన్ వాడే వ్యక్తి రియల్ టైమ్లో తన లొకేషన్ను నమ్మకమైన కాంటాక్ట్స్తో షేర్ చేయగలిగే సదుపాయం. పిల్లల భద్రత కోసం ఇది కీలకం.
యూసేజ్ మేనేజర్ : ఫోన్ వినియోగాన్ని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నియంత్రించగల సామర్థ్యం. ఎవరి నుంచి కాల్స్, మెసేజ్లను అంగీకరించాలో సెలెక్ట్ చేయవచ్చు.
బ్యాటరీ లైఫ్ : ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, ఇది సాధారణ ఫోన్లకు అసాధ్యమైన విషయం.
Reliance Jio | ఎక్కడ దొరుకుతాయి?
ఈ ఫోన్లు త్వరలో జియో స్టోర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్తో పాటు ఇతర ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల్లో అందుబాటులోకి రానున్నాయి. జియో ప్రకటనలో, “సోషల్ మీడియా, అనవసర కాల్స్ లాంటి ఆటంకాల నుండి తమ ఆత్మీయులను దూరంగా ఉంచాలనుకునే కుటుంబాలకు ఇది ఓ సురక్షిత ఎంపిక” అని పేర్కొంది. ఇది 4 వారాల కోర్సు కాగా, ఈ అవకాశాన్ని మరింత ప్రత్యేకంగా మలుస్తూ, జియో ‘జియో ఏఐ క్లాస్రూమ్ (Jio AI Classroom)’ పేరిట విద్యార్థుల కోసం ఉచిత ఏఐ ఫౌండేషన్ కోర్సును కూడా ప్రకటించింది. ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఏఐ ప్రాథమికాలు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు.
యాక్సెస్ మాధ్యమాలు: జియోపీసీ, ల్యాప్టాప్, జియో సెట్ టాప్ బాక్స్, స్మార్ట్ టీవీ కాగా, ఇందుకు ప్రతిఫలంగా డిజిటల్ బ్యాడ్జ్తో పాటు, జియో ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఈ ఆవిష్కరణల ద్వారా జియో మరోసారి స్పష్టం చేసింది – టెక్నాలజీ కేవలం స్మార్ట్ఫోన్ వినియోగదారులకే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలకూ, చిన్నారులకూ, విద్యార్థులకూ అందుబాటులో ఉండాలన్నదే వారి లక్ష్యం. భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే కుటుంబాల కోసం జియో తీసుకొచ్చిన ఈ ‘జియోభారత్’ ఫోన్లు నూతన యుగానికి నాంది పలికేలా ఉన్నాయి. టెక్నాలజీకి అందుబాటులో ఉంటూ ఇవి సరసమైన ధరలలో లభిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.