Vinay Reddy | జీవన్ రెడ్డి ఓ పెద్ద మోసగాడు: కాంగ్రెస్ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్: Vinay Reddy | మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ పెద్ద మోసగాడని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy) విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్​రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. Vinay Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వంలో అందరూ సమానమే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సమానమేనని, ఆర్మూర్ అభివృద్ధికి తాను పాటుపడుతున్నానని స్పష్టం చేశారు. గతంలో […]

అక్షరటుడే, ఆర్మూర్: Vinay Reddy | మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ పెద్ద మోసగాడని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy) విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్​రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.

Vinay Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వంలో అందరూ సమానమే..

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సమానమేనని, ఆర్మూర్ అభివృద్ధికి తాను పాటుపడుతున్నానని స్పష్టం చేశారు. గతంలో అక్రమంగా ఇచ్చిన 147 ఇంటి నెంబర్లను తాము వచ్చాక రద్దు చేశామన్నారు. జీవన్​రెడ్డిని (Jeevan Reddy) ఓడించాలనే ఉద్దేశంతో ప్రచారం చేసి ఆయనను మూడోస్థానికి పరిమితం చేశానని పేర్కొన్నారు.

Vinay Reddy | జీవన్​రెడ్డిపై సినిమా తీస్తా..

జీవన్ రెడ్డి మోసాలపై సినిమా తీస్తే బంపర్ హిట్ అవుతుందని, ఎవరైనా మంచి దర్శకుడు దొరికితే తానే జీవన్ రెడ్డి అక్రమాలు, అరాచకాలపై చిత్రం తీస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేల కంటే పెద్ద మోసగాడు జీవన్ రెడ్డి అని విమర్శించారు. పదేళ్ల పాలనలో జీవన్​ రెడ్డి హత్య రాజకీయాలే నడిపారని ఆరోపించారు. ప్రజలలో తన స్థాయి ఏమిటో జీవన్​రెడ్డి తెలుసుకోవాలన్నారు.

జీవన్ రెడ్డి బాధితులు ఎవరున్నా పీవీఆర్ భవన్​కు రావాలన్నారు. ఆయన అనుచరులు ఎక్కడైనా దౌర్జన్యాలకు పాల్పడితే గల్లా పట్టుకొని అడగాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ను ఖాళీ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. జీవన్ రెడ్డిని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కవితలు ఎలా అయితే తరిమి కొట్టారో.. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సైతం తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, గిరి, కొంతం మురళి, దొండి రమణ, చిట్టీ రెడ్డి, భూపేందర్, జిమ్మి రవి, మజీద్, వాసు, రవికాంత్ రెడ్డి, గోపి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...