Telangana Jagruthi | పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బ్లూప్రింట్​!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Jagruthi | రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అడుగులు వేస్తోంది. ఇందుకోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయని జాగృతి వర్గాలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Jagruthi | రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అడుగులు వేస్తోంది. ఇందుకోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయని జాగృతి వర్గాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) స్వీయ రాజకీయ శక్తిగా నిలుస్తామని కవిత తెలిపారు.

Telangana Jagruthi | 30 కమిటీల ఏర్పాటు

జాగృతి ముఖ్య నాయకులు బుధవారం సమావేశమై ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం’’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని, రాష్టంలోని వివిధ రాజకీయ పార్టీల రాజ్యాంగాలను స్టడీ చేసి జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సాధికారత తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించారు.

కమిటీల బాధ్యులు రానున్న పది రోజుల పాటు వారికి అప్పగించిన రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. తమ నివేదికలను ఈనెల 17వ తేదీన జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన నియమించిన స్టీరింగ్ కమిటీకి సమర్పిస్తారు. స్టీరింగ్ కమిటీ నివేదికపై జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై అందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని జాగృతి నాయకులు తెలిపారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు కోసమే జాగృతి ఈ కమిటీలు, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related articles

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...