social media influencers ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆట కట్టు.. చర్యలకు ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశం

అక్షరటుడే, న్యూఢిల్లీ: social media influencers : మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారిన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న సామాజిక మాధ్యమ ఛానెళ్లను నిషేధించడంతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: social media influencers : మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారిన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న సామాజిక మాధ్యమ ఛానెళ్లను నిషేధించడంతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

social media influencers : సోషల్ మీడియాలో దుష్ప్రచారం..

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గావ్​లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదివరకే భారత్‌కు వ్యతిరేకంగా దేశ మీడియా డిబేట్స్ లో పాకిస్తానీయులు పాల్గొనకండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా దేశంలోని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా సంస్థ ప్రతినిధులు తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గుర్తించింది. ఆ కంటెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పోస్టులు హింసను ప్రేరేపించే అవకాశం ఉందని భావిస్తోంది.

social media influencers : ఆ సోషల్ ఖాతాలపై కేంద్రం నిషేధం

ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఐటీ చట్టం 2000, ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021’ ప్రకారం దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న ఛానళ్లు, ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని ప్రతిపాదనలు పంపించాయి.

కేంద్ర మంత్రిత్వశాఖలు పక్కా సమాచారంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలతో పాటు సోషల్ మీడియా ఖాతాలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం స్టాండింగ్ కమిటీకి కావలసిన సమాచారాన్ని మే 8, 2025 లోగా మనలో ఎవరైనా పంపవచ్చు. దాని సాఫ్ట్ కాపీని comit@sansad.nic.in కు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది.

social media influencers : మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్

భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రక్షణ కోసం మే 7, 2025న దేశ వ్యాప్తంగా సమర్థవంతంగా మాక్ డ్రిల్‌ నిర్వహించాలంది. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ లో ప్రత్యక్షంగా వివరిస్తారు. ఇందులో అధికారులతోపాటు ప్రజలు, వివిధ సంస్థలు, వ్యవస్థలు పాల్గొననున్నాయి.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...