HomeతెలంగాణBRS | ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటు : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే...

BRS | ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటు : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay)​ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది అధికార కాంగ్రెస్​ (Congress) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం తీర్పు మేరకు స్పీకర్​ విచారణ చేపట్టారు. సోమవారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేశారు. టి ప్రకాశ్​గౌడ్​ వర్సెస్​ కల్వకుంట్ల సంజయ్‌, కాలె యాదయ్య వర్సెస్ చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్​ రెడ్డి వర్సెస్​ చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి వర్సెస్​ పల్లా రాజేశ్వర్ రెడ్డి విచారణ సోమవారం సాగింది. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి తరఫున లాయర్లను పంపించారు.

BRS | రాజ్యాంగాన్ని కాపాడాలి

విచారణ అనంతరం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​, పల్లా రాజేశ్వర్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజంగా చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్లి చేసిన తప్పును ఒప్పుకోవాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. మీడియా వాళ్లు రాసిన వార్తలు కూడా నిజం కాదని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారని విమర్శించారు. స్పీకర్ (Speaker) రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన కోరారు.

BRS | 8 మంది వివరణ ఇచ్చారు

పల్లా రాజేశ్వర్​ రెడ్డి (Palla Rajeswar Reddy) మాట్లాడుతూ.. 10 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగ రహస్యమే అన్నారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున హాజరైన లాయర్లు తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అసంబద్ధ ప్రశ్నలు వేసినా.. ఓపికతో సమాధానం చెప్పామన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News