BRS | ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటు : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay)​ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది అధికార కాంగ్రెస్​ (Congress) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం తీర్పు మేరకు స్పీకర్​ విచారణ చేపట్టారు. సోమవారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay)​ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది అధికార కాంగ్రెస్​ (Congress) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం తీర్పు మేరకు స్పీకర్​ విచారణ చేపట్టారు. సోమవారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేశారు. టి ప్రకాశ్​గౌడ్​ వర్సెస్​ కల్వకుంట్ల సంజయ్‌, కాలె యాదయ్య వర్సెస్ చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్​ రెడ్డి వర్సెస్​ చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి వర్సెస్​ పల్లా రాజేశ్వర్ రెడ్డి విచారణ సోమవారం సాగింది. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి తరఫున లాయర్లను పంపించారు.

BRS | రాజ్యాంగాన్ని కాపాడాలి

విచారణ అనంతరం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​, పల్లా రాజేశ్వర్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజంగా చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్లి చేసిన తప్పును ఒప్పుకోవాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. మీడియా వాళ్లు రాసిన వార్తలు కూడా నిజం కాదని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారని విమర్శించారు. స్పీకర్ (Speaker) రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన కోరారు.

BRS | 8 మంది వివరణ ఇచ్చారు

పల్లా రాజేశ్వర్​ రెడ్డి (Palla Rajeswar Reddy) మాట్లాడుతూ.. 10 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగ రహస్యమే అన్నారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున హాజరైన లాయర్లు తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అసంబద్ధ ప్రశ్నలు వేసినా.. ఓపికతో సమాధానం చెప్పామన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...