Iranian Foreign Minister Abbas Araghchi | ఢిల్లీకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి.. ఎందుకోసమంటే..

అక్షరటుడే, న్యూఢిల్లీ: Iranian Foreign Minister Seyyed Abbas Araghchi : ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం రాత్రి న్యూఢిల్లీ New Delhi కి చేరుకున్నారు. ఆగస్టు 2024లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా భారతదేశానికి వచ్చారు. హైదరాబాద్ హౌస్‌ Hyderabad House లో గురువారం మధ్యాహ్నం భారత్​ ఇరాన్ మధ్య జరిగే 20వ జాయింట్ కమిషన్ సమావేశాని Joint Commission meeting కి విదేశాంగ మంత్రి External Affairs […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Iranian Foreign Minister Seyyed Abbas Araghchi : ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం రాత్రి న్యూఢిల్లీ New Delhi కి చేరుకున్నారు. ఆగస్టు 2024లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా భారతదేశానికి వచ్చారు.

హైదరాబాద్ హౌస్‌ Hyderabad House లో గురువారం మధ్యాహ్నం భారత్​ ఇరాన్ మధ్య జరిగే 20వ జాయింట్ కమిషన్ సమావేశాని Joint Commission meeting కి విదేశాంగ మంత్రి External Affairs Minister (EAM) S. జైశంకర్‌ Jaishankar తో కలిసి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి భవన్‌ ashtrapati Bhavan లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము President Draupadi Murmu ను ఇరాన్ విదేశాంగ మంత్రి కలుస్తారు.

భారత్​ – ఇరాన్ స్నేహ ఒప్పందం India-Iran Treaty of Friendship పై సంతకం చేసిన 75వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న జాయింట్ కమిషన్ సమావేశంలో పరస్పర ఆసక్తికర అంశాలను సమీక్షించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పలు అంశాలు ప్రతిపాదిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.

ఏటా జాయింట్ కమిషన్ సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ, కొవిడ్-19 Covid-19 మహమ్మారి, ఇరు దేశాలలో దేశీయ ఆందోళనల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో నిర్వహించలేదు.

“ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక ఒప్పందాల economic agreements అమలు, తాజా పరిస్థితిని కమిషన్ సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకుంటారు” అని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘X’ వేదికగా ప్రకటించింది.

పహల్గామ్​ ఉగ్రవాద దాడి Pahalgaon terror attack ని అరాఘ్చి సైతం తీవ్రంగా ఖండించారు. “పహల్గామ్​ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. భారత ప్రజలకు, ప్రభుత్వానికి మా సంతాపం” అని ఆయన ‘X’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...