Nizamabad CP | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CP | బంగారం దుకాణాలను కొల్లగొట్టి చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు. Nizamabad CP | గతనెల 21వ తేదీన.. బోధన్ పట్టణ (Bodhan town) పరిధిలో గతనెల 21వ తేదీన నలుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా ఆచన్​పల్లిలో ఓ బైక్​ చోరీకి పాల్పడింది. […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CP | బంగారం దుకాణాలను కొల్లగొట్టి చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

Nizamabad CP | గతనెల 21వ తేదీన..

బోధన్ పట్టణ (Bodhan town) పరిధిలో గతనెల 21వ తేదీన నలుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా ఆచన్​పల్లిలో ఓ బైక్​ చోరీకి పాల్పడింది. అనంతరం వారు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న రెండు బంగారు దుకాణాల షెట్టర్లను తొలగించారు. మొత్తంగా 35 తులాల బంగారం, 14 కిలోల వెండి నగలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బోధన్​ పట్టణ పోలీసులు సీసీ పుటేజీలు (CCTV footage), సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు.

Nizamabad CP | అనుమానాస్పద వ్యక్తులను..

ఈ క్రమంలో ఈనెల 11న ఆచన్​పల్లి బైపాస్​ రోడ్​ వద్ద పెట్రోలింగ్​ చేస్తుండగా కొందరు వ్యక్తులు రోడ్డుపక్కనే మద్యం సేవిస్తూ పోలీసుల కంటబడ్డారు. వారిని విచారించేలోపు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి ఇద్దరు వ్యక్తులు, బైకు​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా షట్టర్లు పగులగొట్టింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వారివద్ద నుంచి 14 తులాల బంగారం నగలు, 6 కిలోల వెండి వస్తువులు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చురుకుగా వ్యవహరించిన బోధన్​ ఇన్​స్పెక్టర్​ వెంకట నారాయణ, బోధన్ టౌన్ ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సై బోధన్, బాబురావు, సిబ్బంది రవి, మహేష్, సాయి కుమార్, అశోక్​లను సీపీ అభినందించారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...