అక్షరటుడే, వెబ్డెస్క్ : Saudi Lottery | సౌదీ అరేబియాలో మరో భారతీయుడు జాక్పాట్ తగిలింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.61 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మనదేశంలో లాటరీలపై నిషేధం ఉంది. అయితే సౌదీలో మాత్రం వీటికి భారీ క్రేజ్ ఉంటుంది. దీంతో అక్కడ పని చేస్తున్న భారత్కు చెందిన చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని లాటరీ టికెట్లు కొంటుంటారు. ఈ క్రమంలో తాజాగా కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తి రూ.61.37 కోట్లు గెలుచుకున్నారు.
Saudi Lottery | అబుదాబిలో..
కేరళకు చెందిన పీవీ రాజన్ సౌదీలోని ఓ కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. 15 ఏళ్లుగా ఆయన లాటరీ టికెట్లు (Lottery Tickets) కొనుగోలు చేస్తున్నాడు. అబుదాబి వేదికగా నిర్వహించే ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’ లాటరీ టికెన్ను నవంబర్ 9న కొనుగోలు చేశాడు. డిసెంబర్ 3న లక్కీ డ్రా తీయగా.. పీవీ రాజన్ విజేతగా నిలిచాడు. దీంతో ఆయన రూ.61.37 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్లు) గెలుచుకున్నాడు. తాను గెలిచిన ఈ డబ్బుల్ని తన 15 మంది సహచరులతో పంచుకుంటానని రాజన్ చెప్పాడు.
Saudi Lottery | డ్రా తీసిన భారతీయుడు
లాటరీ గత సీరిస్లో సైతం భారతీయుడు (Indian) విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన శరవణన్ గత నెల 3న తీసిన లాటరీలో 25 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు. దీంతో ఆయన తాజాగా నిర్వాహకులు రిచార్డ్, బౌచ్రా సమక్షంలో లక్కీ డ్రా (Lucky Draw) తీశాడు. రాజన్కు లాటరీ తగిలినట్లు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మనోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘బిగ్ టికెట్ అబుధాబి’ ప్రతినెల లాటరీ నిర్వహిస్తుంది. గ్రాండ్ ప్రైజ్తో పాటు కన్సోలేషన్ బహుమతులు సైతం అందిస్తుంది. ఈ సారి పది మందికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వగా.. అందులో సైతం ముగ్గురు భారతీయులు ఉండటం గమనార్హం.
