India women vs Pakistan women | భారత్​ మహిళల గ్రాండ్​ విక్టరీ.. 88 పరుగుల తేడాతో ఓడిన పాక్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India women vs Pakistan women | పాక్ మహిళలపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో హర్మన్​ ప్రీత్​ Harmanpreet నేతృత్వంలోని భారత్​ జట్టు గెలుపొందింది. మహిళల ప్రపంచ కప్ 2025 (World Cup 2025) లో భారత్​కు ఇది రెండో విజయం. పాక్​ Pakistan మహిళలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియా Team India మొదట […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India women vs Pakistan women | పాక్ మహిళలపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.

ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో హర్మన్​ ప్రీత్​ Harmanpreet నేతృత్వంలోని భారత్​ జట్టు గెలుపొందింది. మహిళల ప్రపంచ కప్ 2025 (World Cup 2025) లో భారత్​కు ఇది రెండో విజయం.

పాక్​ Pakistan మహిళలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియా Team India మొదట బ్యాటింగ్​ చేపట్టింది.

హర్లీన్ డియోల్(46), రిచా ఘోష్(35, నాటౌట్), జెమిమా రోడ్రిగ్యూస్(32), ప్రతీక రావల్(31), దీప్తి శర్మ(25), స్మృతి మందాన(23), స్నేహ్ రాణా(20) రాణించడంతో భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది.

India women vs Pakistan women | పేలవంగా బ్యాటింగ్​..

248 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళలకు​ దీప్తి శర్మ Deepti Sharma, క్రాంతి గౌడ్ Kranti Goud, స్నేహ్ రాణా Sneh Rana ముచ్చెమటలు పట్టించారు. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో 3 వికెట్లు తీశారు. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది.

పాకిస్థాన్​ జట్టులో సిద్రా అమీన్(81) మినహా మిగతావారు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యారు. నటాలియా పర్వేజ్ 33 రన్స్ చేసింది.

సిద్రా నవాజ్ 14 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాక్​ జట్టులో ఇద్దరు డకౌట్ అయ్యారు. మిగతావారు సింగిల్​ డిజిట్స్​కే పరిమితమయ్యారు.

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...