Homeక్రీడలుIndia women vs Pakistan women | భారత్​ మహిళల గ్రాండ్​ విక్టరీ.. 88 పరుగుల...

India women vs Pakistan women | భారత్​ మహిళల గ్రాండ్​ విక్టరీ.. 88 పరుగుల తేడాతో ఓడిన పాక్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India women vs Pakistan women | పాక్ మహిళలపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.

ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో హర్మన్​ ప్రీత్​ Harmanpreet నేతృత్వంలోని భారత్​ జట్టు గెలుపొందింది. మహిళల ప్రపంచ కప్ 2025 (World Cup 2025) లో భారత్​కు ఇది రెండో విజయం.

పాక్​ Pakistan మహిళలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియా Team India మొదట బ్యాటింగ్​ చేపట్టింది.

హర్లీన్ డియోల్(46), రిచా ఘోష్(35, నాటౌట్), జెమిమా రోడ్రిగ్యూస్(32), ప్రతీక రావల్(31), దీప్తి శర్మ(25), స్మృతి మందాన(23), స్నేహ్ రాణా(20) రాణించడంతో భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది.

India women vs Pakistan women | పేలవంగా బ్యాటింగ్​..

248 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళలకు​ దీప్తి శర్మ Deepti Sharma, క్రాంతి గౌడ్ Kranti Goud, స్నేహ్ రాణా Sneh Rana ముచ్చెమటలు పట్టించారు. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో 3 వికెట్లు తీశారు. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది.

పాకిస్థాన్​ జట్టులో సిద్రా అమీన్(81) మినహా మిగతావారు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యారు. నటాలియా పర్వేజ్ 33 రన్స్ చేసింది.

సిద్రా నవాజ్ 14 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాక్​ జట్టులో ఇద్దరు డకౌట్ అయ్యారు. మిగతావారు సింగిల్​ డిజిట్స్​కే పరిమితమయ్యారు.