PM Modi | భారత్​ శాంతి వైపే ఉంటుంది : ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ (Hyderabad House)లో భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆరంభంలోనే పుతిన్‌తో శాంతి గురించి ప్రధాని మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War)లో భారత్‌ తటస్థంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ (Hyderabad House)లో భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆరంభంలోనే పుతిన్‌తో శాంతి గురించి ప్రధాని మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War)లో భారత్‌ తటస్థంగా లేదని చెప్పారు. భారత్‌ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షించారు.

PM Modi | గాంధీకి నివాళి

పుతిన్​ ముందుగా రాజ్​ఘాట్​లోని మహాత్మ గాంధీ (Mahatma Gandhi) సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్​ (Rashtrapati Bhavan)కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ–పుతిన్​ (Modi-Putin) భేటీ అయ్యారు. పుతిన్‌ విజన్‌కు భారత్‌, రష్యా ఒప్పందాలే ఉదాహరణ ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు.

తనను భారతదేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పుతిన్ మాట్లాడుతూ, శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...