అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ (Hyderabad House)లో భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆరంభంలోనే పుతిన్తో శాంతి గురించి ప్రధాని మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War)లో భారత్ తటస్థంగా లేదని చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షించారు.
PM Modi | గాంధీకి నివాళి
పుతిన్ ముందుగా రాజ్ఘాట్లోని మహాత్మ గాంధీ (Mahatma Gandhi) సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)కు చేరుకున్నారు. పుతిన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ–పుతిన్ (Modi-Putin) భేటీ అయ్యారు. పుతిన్ విజన్కు భారత్, రష్యా ఒప్పందాలే ఉదాహరణ ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు.
తనను భారతదేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పుతిన్ మాట్లాడుతూ, శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
