PM Modi | భారత్​ బెదిరింపులకు తలొగ్గదు : ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | భారత్​ బెదిరింపులకు తలొగ్గదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీ కృష్ణ మఠంలో (Udupi Sri Krishna Math)జరిగిన లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు తొమ్మిది తీర్మానాలు తీసుకోవాలని మోదీ సూచించారు. 2047 నాటికి వికసిత్​ భారత్​ (Vikasit Bharat) లక్ష్యంగా ప్రతి ఒక్కరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | భారత్​ బెదిరింపులకు తలొగ్గదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీ కృష్ణ మఠంలో (Udupi Sri Krishna Math)జరిగిన లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు తొమ్మిది తీర్మానాలు తీసుకోవాలని మోదీ సూచించారు. 2047 నాటికి వికసిత్​ భారత్​ (Vikasit Bharat) లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. నీటిని సంరక్షించడం, చెట్లను నాటడం, ఒక పేద వ్యక్తిని ఉద్ధరించడం, స్వదేశీని స్వీకరించడం వంటి తీర్మానాలు చేసుకోవాలన్నారు. లక్ష కంఠ గీతా పారాయణం నిర్వహించినందుకు మఠం పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీని మోదీ అభినందించారు.

PM Modi | సుదర్శన చక్ర..

దేశంలో గతంలో ఉగ్రదాడులు (terrorist attacks) జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నారు. కానీ ప్రస్తుతం భారత్​ ఎవరి ముందు తలవంచదని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో తాము ఎన్నటికి వెనకడుగు వేయమని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రపంచం మన సంకల్పాన్ని చూసిందన్నారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశంలో సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను (Sudarshana Chakra protection system) ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కృష్ణుడు బోధించాడన్నారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’, ‘సర్వజన్‌ హితయ’ అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవే అని తెలిపారు.

ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) గురించి ప్రస్తావిస్తూ, ధర్మాన్ని రక్షించడంలో చెడును అంతం చేయడం కూడా భాగమని మోదీ అన్నారు. మన సుదర్శన చక్రం దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కృష్ణ మఠాన్ని సందర్శించిన తర్వాత మోదీ అసెంబ్లీ హాల్​కు చేరుకున్నారు. అక్కడ ఆయన భగవద్గీతలోని 18వ అధ్యాయం ముగింపు శ్లోకాలను పఠించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...