Ind vs Pak | ఆసియా కప్​ 2025 : ముచ్చటగా మూడోసారి పాక్​కు తప్పని​ ఓటమి.. ఆసియా కప్​ భారత్​ కైవసం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ind vs Pak : ఆసియా కప్ – 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టును భారత్​ చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంటులో భారత్​ చేతిలో పాక్​కు ఇది మూడోసారి ఓటమి కావడం గమనార్హం. ఇక భారత ఆటగాళ్లు ఆసియా కప్​ టోర్నమెంటులో విజయ దుందుభి మోగించారు. మొదటి నుంచి చక్కని ఆట తీరును కనబర్చుతూ చివరికి టోర్నీ కప్​ను కైవసం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్​ గెలిచిన భారత్​ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ind vs Pak : ఆసియా కప్ – 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టును భారత్​ చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంటులో భారత్​ చేతిలో పాక్​కు ఇది మూడోసారి ఓటమి కావడం గమనార్హం.

ఇక భారత ఆటగాళ్లు ఆసియా కప్​ టోర్నమెంటులో విజయ దుందుభి మోగించారు. మొదటి నుంచి చక్కని ఆట తీరును కనబర్చుతూ చివరికి టోర్నీ కప్​ను కైవసం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకుంది.

టాస్​ గెలిచిన భారత్​ బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్​ చేపట్టిన పాకిస్తాన్​ ఆటగాళ్లు 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యారు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు పాక్​ జట్టు గట్టిగానే పోటీ ఇచ్చింది. దీంతో ఫైనల్​ మ్యాచ్​ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఎట్టకేలకు ఐదు వికెట్ల తేడా ఇండియా జట్టు నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించింది.

Ind vs Pak : ఆదుకున్న తిలక్​ వర్మ

భారత్​ జట్టు బౌలింగ్​లోకి దిగాక మొదట గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో తిలక్ వర్మ, శివమ్​ దూబే ఆదుకున్నారు.

పాక్​ బౌలర్లను తిలక్​ ఎదుర్కొంటూ జట్టుకు పరుగులు అందించాడు. తిలక్​ (69) చివరి వరకు నిలబడి భారత్​కు విజయం అందించాడు.

శివమ్​ దూబే (33) కూడా జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్​ వచ్చి భారత్​ విజయానికి దోహదపడ్డాడు.

కుల్​దీప్​ మంత్రదండం

పాక్​ బ్యాటర్లు మొదట భారీగా స్కోర్​ చేస్తూ పోయారు. పాక్​ ఓపెనర్లు ఫర్హాన్​, ఫకర్​ జమాన్​ నిలకడగా ఆడి 45 పరుగులు చేశారు. ఫర్హాన్ (57)​ అర్ధ శతకం పూర్తిచేసుకుని వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​లో తిలక్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఫకర్​ (48) కూడా దూకుడుగా ఆడాడు.

దీంతో దాయాది జట్టు దూసుకుపోతున్న తరుణంలో కుల్​దీప్​ యాదవ్​ ఒకే ఓవర్​లో మూడు వికెట్లు తీశాడు. దీంతో అప్పటి వరకు దాయాది జట్టు చేతిలో ఉన్న ఆట భారత్​ చేతిలోకి వచ్చింది.

అజేయంగా భారత్​

టీమిండియా ఈ టోర్నమెంటుల్ అజేయంగా నిలిచింది. లీగ్​లో మూడు మ్యాచ్​లు ఆడింది. సూపర్​ 4లో మూడు ఆడింది. ఫైనల్​తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్​లు ఆడగా.. అన్నింట్లోనూ విజయం సాధించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...