Homeక్రీడలుInd vs Pak | ఆసియా కప్​ 2025 : ముచ్చటగా మూడోసారి పాక్​కు తప్పని​...

Ind vs Pak | ఆసియా కప్​ 2025 : ముచ్చటగా మూడోసారి పాక్​కు తప్పని​ ఓటమి.. ఆసియా కప్​ భారత్​ కైవసం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ind vs Pak : ఆసియా కప్ – 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టును భారత్​ చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంటులో భారత్​ చేతిలో పాక్​కు ఇది మూడోసారి ఓటమి కావడం గమనార్హం.

ఇక భారత ఆటగాళ్లు ఆసియా కప్​ టోర్నమెంటులో విజయ దుందుభి మోగించారు. మొదటి నుంచి చక్కని ఆట తీరును కనబర్చుతూ చివరికి టోర్నీ కప్​ను కైవసం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకుంది.

టాస్​ గెలిచిన భారత్​ బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్​ చేపట్టిన పాకిస్తాన్​ ఆటగాళ్లు 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యారు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు పాక్​ జట్టు గట్టిగానే పోటీ ఇచ్చింది. దీంతో ఫైనల్​ మ్యాచ్​ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఎట్టకేలకు ఐదు వికెట్ల తేడా ఇండియా జట్టు నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించింది.

Ind vs Pak : ఆదుకున్న తిలక్​ వర్మ

భారత్​ జట్టు బౌలింగ్​లోకి దిగాక మొదట గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో తిలక్ వర్మ, శివమ్​ దూబే ఆదుకున్నారు.

పాక్​ బౌలర్లను తిలక్​ ఎదుర్కొంటూ జట్టుకు పరుగులు అందించాడు. తిలక్​ (69) చివరి వరకు నిలబడి భారత్​కు విజయం అందించాడు.

శివమ్​ దూబే (33) కూడా జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్​ వచ్చి భారత్​ విజయానికి దోహదపడ్డాడు.

కుల్​దీప్​ మంత్రదండం

పాక్​ బ్యాటర్లు మొదట భారీగా స్కోర్​ చేస్తూ పోయారు. పాక్​ ఓపెనర్లు ఫర్హాన్​, ఫకర్​ జమాన్​ నిలకడగా ఆడి 45 పరుగులు చేశారు. ఫర్హాన్ (57)​ అర్ధ శతకం పూర్తిచేసుకుని వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​లో తిలక్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఫకర్​ (48) కూడా దూకుడుగా ఆడాడు.

దీంతో దాయాది జట్టు దూసుకుపోతున్న తరుణంలో కుల్​దీప్​ యాదవ్​ ఒకే ఓవర్​లో మూడు వికెట్లు తీశాడు. దీంతో అప్పటి వరకు దాయాది జట్టు చేతిలో ఉన్న ఆట భారత్​ చేతిలోకి వచ్చింది.

అజేయంగా భారత్​

టీమిండియా ఈ టోర్నమెంటుల్ అజేయంగా నిలిచింది. లీగ్​లో మూడు మ్యాచ్​లు ఆడింది. సూపర్​ 4లో మూడు ఆడింది. ఫైనల్​తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్​లు ఆడగా.. అన్నింట్లోనూ విజయం సాధించింది.

Must Read
Related News