IND vs NZ | కింగ్ సెంచరీ వృథా.. ఓడిన భారత్.. సిరీస్​ను సొంతం చేసుకున్న కివీస్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ : భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో టీమ్ ఇండియా అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ విజయం సాధించి, సిరీస్​ను సొంతం చేసుకుంది. కింగ్ కోహ్లీ Kohli సెంచరీ వృథా అయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో కివీస్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 300 పరుగులు దాటి పోరాడినా.. వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. టాస్ గెలిచిన భారత్ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ : భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో టీమ్ ఇండియా అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ విజయం సాధించి, సిరీస్​ను సొంతం చేసుకుంది.

కింగ్ కోహ్లీ Kohli సెంచరీ వృథా అయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో కివీస్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 300 పరుగులు దాటి పోరాడినా.. వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు.

టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్​ చేపట్టిన కివీస్ బ్యాటర్లు మైదానంలో చెలరేగిపోయారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) రెచ్చిపోయారు. దీంతో కివీస్337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీసినా, మిడిల్ ఓవర్లలో కివీస్​ పరుగులను కట్టడి చేయలేకపోయారు.

338 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్​ చేపట్టిన భారత్​కు.. ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలాయి. శుభ్‌మన్ గిల్ (23),రోహిత్ శర్మ (11) పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు. శ్రేయస్ అయ్యర్ (3), రాహుల్ (1) విఫలమయ్యారు. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దుస్థితి భారత్​ జట్టుది.

IND vs NZ : కోహ్లీ వీరోచిత పోరాటం..

అదే సమయంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (124 ).. నితీష్ కుమార్ రెడ్డి (53)తో కలిసి ఇన్నింగ్స్‌ను తన చేతిలోకి తీసుకున్నాడు. నితీష్ ఔట్​ అయ్యాక హర్షిత్ రాణా బ్యాటింగ్​ చేపట్టి, కేవలం 41 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా తన 54వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్​ కొనసాగించినంత సమయం కూడా భారత్​ వైపే విజయావకాశాలు కొనసాగాయి.

అయితే కోహ్లీతోపాటు సిరాజ్ కూడా ఔట్​ కావడంతో భారత్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. నిర్దేశిత లక్ష్యానికి మరో 41 పరుగులు ఉండగానే టీమిండియా ఆలౌట్​ అయింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...