IND vs NZ | మొదటి టీ 20లో కివీస్​పై భారత్​ ఘన విజయం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ | కివీస్​తో జరిగిన మొదటి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. నాగ్​పూర్​లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 21) జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.  తద్వారా సిరీస్​లో 1-0 ఆధిక్యంలో భారత్​ నిలిచింది. ఈ మ్యాచ్​లో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. IND vs NZ | అభిషేక్ శర్మ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ | కివీస్​తో జరిగిన మొదటి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. నాగ్​పూర్​లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 21) జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.  తద్వారా సిరీస్​లో 1-0 ఆధిక్యంలో భారత్​ నిలిచింది. ఈ మ్యాచ్​లో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

IND vs NZ | అభిషేక్ శర్మ మెరుపులు

మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి,  238 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) ఇలా వచ్చి అలా వెళ్లడంతో జట్టుకు ఆరంభం కలిసి రాలేదు. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దుస్థితి జట్టుది. ఈ క్రమంలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ(84) మైదానంలో చెలరేగిపోయాడు. సూర్య(32) సైతం దుమ్ముదులిపాడు.

కాగా, మిడిల్ ఓవర్స్ లో న్యూజిలాండ్​ పుంజుకోవడంతో భారత జట్టు 185 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో క్రీజ్​లోకి వచ్చిన రింకూ సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేయడంతో భారత్​ ఖాతాలోకి భారీ స్కోర్​ చేరింది.

భారీ లక్ష్య ఛేదనతో తదుపరి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కివీస్​కు ఓటమి తప్పలేదు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తొలి ఓవర్​లోనే కాన్వేను డకౌట్​ చేసి, పెవిలియన్​కు పంపాడు. రద్దీన్ రవీంద్ర(1) ను ఔట్ చేసి హార్దిక్ పాండ్య రెండో వికెట్ అందించాడు.

ఈ క్రమంలో న్యూజిలాండ్​ను ఆదుకునే బాధ్యత రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ పై పడింది. ఈ జోడీ భారీ షాట్లతో స్కోర్​ను పెంచేందుకు చూసినా..  వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్​లోనే వారిని విడదీసి, రాబిన్సన్(21)ను ఔట్ చేశాడు.

అయినా చాప్ మాన్ (39) తో కలిసి ఫిలిప్స్ మరో భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. దూకుడుగా ఆడుతున్న పిలిప్స్( 78)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో కివీస్ చతికిలబడింది. చివర్లో మిచెల్, సాంట్నర్ తమ బ్యాటింగ్​తో మురిపించినా.. జట్టును విజయం వరకు తీసుకెళ్లలేకపోయారు. భారత బౌలర్లలో శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...