Shabbir Ali | నాలుగు ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకం మంజూరు: షబ్బీర్​అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నియోజకవర్గంలోని నాలుగు ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో సంబంధిత ఆలయ పూజారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖతో (Endowments Minister Konda Surekha) మాట్లాడి నాలుగు దేవాలయాలకు దీపదూప నైవేద్య పథకం మంజూరు చేయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ (Endowments Department) […]

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నియోజకవర్గంలోని నాలుగు ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో సంబంధిత ఆలయ పూజారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖతో (Endowments Minister Konda Surekha) మాట్లాడి నాలుగు దేవాలయాలకు దీపదూప నైవేద్య పథకం మంజూరు చేయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ (Endowments Department) పరిధిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ అవి దూపదీప నైవేద్యానికి నోచడం లేదన్నారు. వాటికి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయని తెలిపారు.

విశిష్టత కలిగిన ఆలయాలను గుర్తించి నిత్యం పూజలు నిర్వహించేందుకు, అర్చకులకు కనీస వేతనం, ఆలయాల నిర్వహణకు కనీస ఖర్చుల కింద ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఆలయ పూజారికి రూ.6 వేల చొప్పున, ఆలయ నిర్వహణకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.10వేల పూజారి ఖాతాలో జమ చేయనుందన్నారు.

Shabbir Ali | మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు

మహిళల ఆత్మ గౌరవానికి కోటి చీరలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో (Telangana Pragathi program) పాల్గొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళ శక్తి తెలంగాణ శక్తి అని అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

Shabbir Ali | బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోంది..

ఎన్నికల సమయంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. దోమకొండ మండల (Domakonda Mandal) కేంద్రంలో ఓటు చోరీపై నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సంతకాల సేకరణ ఉద్యమం ద్వారా ప్రజలు తమ ఓటు హక్కు గురించి చైతన్యవంతులై, రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...