Panchayat Elections | నిజామాబాద్​లో ఉదయం 11 గంటలకు 49.13 శాతం ఓటింగ్​.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

అక్షరటుడే, ఇందూరు/నిజామాబాద్​ సిటీ: Panchayat Elections | గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్​లో 8 మండలాల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసుశాఖ (Nizamabad Police) నుంచి సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను సైతం మోహరించారు. Panchayat Elections | ఉదయం 11 గంటల వరకు.. ఆదివారం ఉదయం 11 […]

అక్షరటుడే, ఇందూరు/నిజామాబాద్​ సిటీ: Panchayat Elections | గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్​లో 8 మండలాల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసుశాఖ (Nizamabad Police) నుంచి సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను సైతం మోహరించారు.

Panchayat Elections

Panchayat Elections | ఉదయం 11 గంటల వరకు..

ఆదివారం ఉదయం 11 గంటలకు వరకు 49.13 శాతం ఓట్లు పోలయ్యాయి. ధర్పల్లి మండలంలో 53.59 శాతం, డిచ్​పల్లిలో(Dichpally) 35.36 శాతం, ఇందల్వాయిలో 50.45 శాతం, జక్రాన్​పల్లిలో 55.16 శాతం, మాక్లూర్​లో 56.26, నిజామాబాద్ రూరల్​లో 60.28శాతం, సిరికొండలో 38.49 శాతం ఓట్లు పోలయ్యాయి.

Panchayat Elections | పోలింగ్ సరళిని పరిశీలించిన పోలీస్ కమిషనర్

రెండో విడత ఎన్నికల్లో భాగంగా మోపాల్​, డిచ్​పల్లి మండంలోని కంజర, కులాస్పూర్,  ఘన్​పూర్​, ధర్మారం (బి) గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను సీపీ సాయి చైతన్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలన్నారు. సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు మహేశ్​, ఆరిఫ్, సుమలత , ఆర్వో అధికారులు శ్రీనివాస్, షేక్ మస్జీద్ , రాజ నర్సయ్య, మధుసూదన్ ఇతర అధికారులు ఉన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...