Stock Market | రెండో రోజూ నష్టాల్లోనే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | భారతీయ స్టాక్‌ మార్కెట్‌ (Indian Stock Market) వరుసగా రెండో రోజు నష్టాలతోనే ముగిసింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో మంగళవారం రోజంతా ప్రధాన సూచీలు నష్టాలతోనే సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 503 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | భారతీయ స్టాక్‌ మార్కెట్‌ (Indian Stock Market) వరుసగా రెండో రోజు నష్టాలతోనే ముగిసింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో మంగళవారం రోజంతా ప్రధాన సూచీలు నష్టాలతోనే సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 503 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock mMarkets) నష్టాల బాటలో కొనసాగాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 316 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 85,053 నుంచి 85,553 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ (Nifty) 25,997 నుంచి 26,154 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 503 పాయింట్ల నష్టంతో 85,138 వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 26,032 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ మూడు రోజులల ద్రవ్య విధాన సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. మీటింగ్‌ తీర్మానాలు 5వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

స్మాల్‌, లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఒత్తిడి..

బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్‌ 0.65 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 0.45 శాతం పెరిగాయి. సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1.03 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.78 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.67 శాతం, ఇన్‌ఫ్రా 0.55 శాతం, ఎనర్జీ 0.45 శాతం, పవర్‌ 0.42 శాతం, యుటిలిటీ ఇండెక్స్‌ 0.40 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.49 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.46 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.14 శాతం నష్టపోయాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,586 కంపెనీలు లాభపడగా 2,563 స్టాక్స్‌ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 106 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 249 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్‌ 3.11 శాతం, మారుతి 0.83 శాతం, ఎయిర్‌టెల్‌ 0.59 శాతం, హెచ్‌యూఎల్‌ 0.55 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.54 శాతం లాభపడ్డాయి.

Top Losers : యాక్సిస్‌ బ్యాంక్‌ 1.29 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.25 శాతం, రిలయన్స్‌ 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.24 శాతం, బీఈఎల్‌ 1.01 శాతం నష్టపోయాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...