Imran Khan | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై స్పందించిన సోదరి ఉజ్మా.. ఆయ‌న బతికే ఉన్నారు, కానీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Imran Khan | పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం గురించి ఆయన సోదరి డాక్టర్‌ ఉజ్మా (Dr. Uzma) కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కొన్ని వారాలుగా ఆయనను ఎవరికీ కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఆందోళనలు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు అనుమతి లభించడంతో మంగళవారం సాయంత్రం 20 నిమిషాలపాటు ఆమె ఆయనతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Imran Khan | పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం గురించి ఆయన సోదరి డాక్టర్‌ ఉజ్మా (Dr. Uzma) కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

కొన్ని వారాలుగా ఆయనను ఎవరికీ కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఆందోళనలు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు అనుమతి లభించడంతో మంగళవారం సాయంత్రం 20 నిమిషాలపాటు ఆమె ఆయనతో మాట్లాడారు. ఉజ్మా వెల్లడించిన వివరాల ప్రకారం… “ఇమ్రాన్‌ బతికే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు… కానీ మానసికపరంగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు” అని స్పష్టంచేశారు.

 Imran Khan | బ్ర‌తికే ఉన్నారు..

రోజంతా సెల్లోనే నిర్బంధించి, చాలా తక్కువ సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారని చెప్పారు. ఎవరితోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అలాగే, పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీం మునీర్‌ (Pakistan Army Chief General Asim Munir)పై ఇమ్రాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉజ్మా తెలిపారు. మొత్తం సైన్యాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, తాను, కొంద‌రు ఉన్నతాధికారులు జీవితాంతం శిక్షల నుంచి మినహాయింపుల కోసం రాజ్యాంగ మార్పులు చేయించుకున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారని చెప్పారు. తన నిర్బంధానికి అసీం మునీర్‌ ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ పరిస్థితిపై పీటీఐ అనుచరులు (PTI Supporters) పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై, భద్రతపై అధికారుల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని ఉజ్మా డిమాండ్ చేశారు.అయితే ఇమ్రాన్ చ‌నిపోయాడ‌ని రెండు రోజులు వార్త‌లు వచ్చిన నేప‌థ్యంలో పీటీఐ కార్య‌కర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ఉద్య‌మాలు చేశారు. ఈ క్ర‌మంలో 144 సెక్షన్ కూడా అమ‌లు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...