Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | జిల్లాలో 30, 30ఏ యాక్టు అమలు: ఎస్పీ రాజేష్​ చంద్ర

SP Rajesh Chandra | జిల్లాలో 30, 30ఏ యాక్టు అమలు: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా నెలరోజుల పాటు 30, 30ఏ యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ యాక్ట్​ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు (Public Meetings), సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజాధనానికి నష్టం కల్గించే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు సహకరించాలని కోరారు.