Hanmakonda | పట్టించుకోని కొడుకు.. రూ. మూడు కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన తండ్రి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నలను వయసు మీద పడ్డాక పలకరించడం కూడా మానేస్తున్నారు. వారి ఆస్తులు తీసుకుంటున్న పిల్లలు.. బాగోగులు మాత్రం మర్చిపోతున్నారు. ఇలాగే తనను పట్టించుకోని ఓ కుమారుడికి తండ్రి షాక్​ ఇచ్చాడు. కొడుకు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తన రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ఆ స్థలంలో తన భార్య జ్ఞాపకార్థం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నలను వయసు మీద పడ్డాక పలకరించడం కూడా మానేస్తున్నారు. వారి ఆస్తులు తీసుకుంటున్న పిల్లలు.. బాగోగులు మాత్రం మర్చిపోతున్నారు. ఇలాగే తనను పట్టించుకోని ఓ కుమారుడికి తండ్రి షాక్​ ఇచ్చాడు.

కొడుకు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తన రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ఆ స్థలంలో తన భార్య జ్ఞాపకార్థం ఒక భవనం నిర్మించాలని కోరారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల (Elkathurthi Mandal) కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్కతుర్తికి చెందిన గోలి శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులు. శ్యాంసుందర్​ రెడ్డి గతంలో ఎంపీపీగా పని చేశారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేయడంతో అమెరికాలో ఉంటుంది. కుమారుడు హన్మకొండలో ఉంటున్నాడు.

Hanmakonda | ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో..

శ్యాంసుందర్​రెడ్డికి పది ఎకరాల మామిడి తోట, ఎల్కతుర్తి, హనుమకొండలో (Hanmakonda) ఇల్లు ఉన్నాయి. ఆయన భార్య వసంత 2021లో కరోనాతో చనిపోయింది. అప్పటి నుంచి ఆయన తన కుమారుడి వద్ద ఉంటున్నాడు. అయితే ఇటీవల తల్లి పేరు మీద ఉన్న భూమిని, హనుమకొండలోని ఇంటిని శ్యాంసుందరెడ్డి కుమారుడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడు. అనంతరం తండ్రిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఎల్కతుర్తిలో ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడు.

Hanmakonda | గుణపాఠం కావాలని..

కుమారుడిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన శ్యాంసుందర్ రెడ్డి తనకు ఉన్న మూడు ఎకరాల భూమిని (సుమారు రూ. మూడు కోట్లు) ప్రభుత్వానికి దానంగా ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులను (Revenue Officers) కలిసి సంబంధిత పత్రాలు రాయించి, సంతకాలు కూడా చేశాడు. దాని కాపీని తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar Office) అందించాడు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు తన నిర్ణయంతో కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ఆ స్థలంలో తన భార్య పేరిట ఏదైనా భవనం నిర్మించాలని ఆయన కోరారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...