అక్షరటుడే, ఇందూరు: Duddilla Giribabu | తనను గెలిపిస్తే 47వ డివిజన్ను శరవేగంగా అభివృద్ధి చేసి, పేదలకు అండగా నిలుస్తానని 47వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి దుద్దిళ్ల గిరిబాబు (BJP candidate Duddilla Giribabu) హామీ ఇచ్చారు. అంగడిబజార్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Duddilla Giribabu | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..
ఈ సందర్భంగా దుద్దిళ్ల గిరిబాబు మాట్లాడుతూ.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగిస్తూ ప్రతి డివిజన్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. పారదర్శకమైన, అవినీతిరహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. 47వ డివిజన్లో ముఖ్యంగా డ్రెయినేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని గిరిబాబు హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానన్నారు.
పనిచేసే వారినే ఎన్నుకోవాలి..
స్వచ్ఛ భారత్ అభియాన్, ముద్ర యోజన వంటి పథకాలతో పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని గిరిబాబు ప్రజలకు వివరించారు. పనిచేసే నాయకులను, అభివృద్ధిని కోరుకునే పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని, అలాగే ‘మన ఇందూరు – మన మేయర్’ నినాదంతో బీజేపీ అభ్యర్థులను ఆదరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.