Jadcharla MLA | చర్యలు తీసుకోకపోతే అరబిందో ఫార్మాను తగులబెడతా.. అధికారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అల్టిమేటం

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jadcharla MLA | సొంత ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా కంపెనీపై (Aurobindo Pharma Company) ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. శనివారం లోగా చర్యలు చేపట్టాలని అల్టీమేటం జారీ చేశారు. లేకపోతే ఆదివారం తానే ఆ కంపెనీని తగలబెడతానని శుక్రవారం విడుదల చేసిన ఓ వీడియాలో హెచ్చరించారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jadcharla MLA | సొంత ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా కంపెనీపై (Aurobindo Pharma Company) ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. శనివారం లోగా చర్యలు చేపట్టాలని అల్టీమేటం జారీ చేశారు.

లేకపోతే ఆదివారం తానే ఆ కంపెనీని తగలబెడతానని శుక్రవారం విడుదల చేసిన ఓ వీడియాలో హెచ్చరించారు. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, పలుమార్లు హెచ్చరించినా అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి (Muddireddypalli lake) కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒకరోజు టైమ్ ఇస్తున్నానన్నారు. ఈలోగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) చర్యలు తీసుకోకపోతే ఆదివారం 11 గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి ఆ కంపెనీని తానే తగులబెడతానని హెచ్చరించారు.

Jadcharla MLA | కలుషిత జలాలతో ముప్పు

పోలేపల్లి ఫార్మా సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండడం లేదని, చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై తాను గతంలోనే అసెంబ్లీలో (Assembly) ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో అధికారులకు, అరబిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచీ ఉందో తనకు తెలియదన్నారు.

మరోసారి కలుసిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని, ఇంకోసారి అలా చేస్తే అరబిందో ఫార్మా కంపెనీని తగుల బెడతానని గతంలోనే హెచ్చరించానని గుర్తు చేశారు.. అయినప్పటికీ అరబిందో ఫార్మా మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను (videos and photos) మీడియాకు విడుదల చేసిన ఆయన.. కలుషిత జలాలను చెరువులోకి వదలడం వెంటనే ఆపాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అరబిందో పై చర్యలు తీసుకోవడానికి పీసీబీకి ఒక్క రోజు గడువు ఇస్తున్నానని తెలిపారు. పీసీబీ చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి దాన్ని తగలబెడతానని హెచ్చరించారు. రైతులు (Farmers) నష్టపోతుంటే చూస్తూ ఊరుకొనే ఓపిక తనకు లేదన్నారు. పీసీబీ అధికారులు అరబిందో పై చర్యలు తీసుకుంటారో, లేక దాన్ని తగలబెట్టకతప్పని పరిస్థితి తీసుకొస్తారో ఇక వాళ్ల ఇష్టమని తేల్చి చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...