Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శనివారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు వద్దని.. కాలేజీలు నడుపుకుంటూ ప్రజా సేవ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే 73 ఏళ్లు వచ్చాయని.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చూసిన అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శనివారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు వద్దని.. కాలేజీలు నడుపుకుంటూ ప్రజా సేవ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే 73 ఏళ్లు వచ్చాయని.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చూసిన అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు.

మల్లారెడ్డికి మేడ్చల్​ జిల్లాలోని కొంపల్లి, దుండిగల్​, మైసమ్మగూడ, సూరారాం ప్రాంతంలో మల్లారెడ్డి (Mallareddy)కి ఇంజినీరింగ్​, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన టీడీపీ (TDP) నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. అనంతరం 2016లో ఆయన బీఆర్​ఎస్​లో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ (BRS) నుంచి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. 2023 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అప్పటి కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. అనుమతులు లేవని ఆయనకు చెందిన పలు కాలేజీ భవనాలు కూల్చి వేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు మల్లారెడ్డి తన మాస్​ డైలాగ్​లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

Mallareddy | పొలిటిక్స్​కు గుడ్​బై చెబుతారా..

మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీఆర్​ఎస్​లోనే ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ వైపు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయితే కాంగ్రెస్​ (Congress) అధికారంలోకి రావడంతో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన 10 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం ఆయన బీజేపీ(BJP)లో చేరనున్నారు. మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు సైతం బీఆర్​ఎస్​ను వీడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి రాజకీయాల్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బోనాల సందర్భంగా ఆమె బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...