Hydraa | వరదల కట్టడికి హైడ్రా చర్యలు.. ఆక్రమణదారుల్లో ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad)​ ప్రజలు వణికిపోతారు. చిన్న వాన కురిసినా పలు కాలనీలు జలమయం కావడంతో పాటు రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​తో గంటల తరబడి రోడ్లపై ఉండిపోతారు. ఏళ్లుగా ఈ సమస్య నగర వాసులను వేధిస్తోంది. అయితే తాజాగా హైడ్రా (hydraa) మహానగరంలో వరద కట్టడికి చర్యలు చేపట్టింది. ఇటీవల సికింద్రాబాద్​ (Secunderabad)లోని ప్యాట్నీ సెంటర్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad)​ ప్రజలు వణికిపోతారు. చిన్న వాన కురిసినా పలు కాలనీలు జలమయం కావడంతో పాటు రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​తో గంటల తరబడి రోడ్లపై ఉండిపోతారు. ఏళ్లుగా ఈ సమస్య నగర వాసులను వేధిస్తోంది. అయితే తాజాగా హైడ్రా (hydraa) మహానగరంలో వరద కట్టడికి చర్యలు చేపట్టింది. ఇటీవల సికింద్రాబాద్​ (Secunderabad)లోని ప్యాట్నీ సెంటర్​ వద్ద నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

Hydraa | మాదాపూర్​లో పర్యటించిన కమిషనర్

హైదరాబాద్​ నగరంలో మాదాపూర్​, హైటెక్ ​సిటీ ప్రాంతంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సైతం ప్రజలు వరద ముంపుతో అనేక ఇబ్బందుల పడతారు. ఈ క్రమంలో సోమవారం మాదాపూర్ (Madhapur)​లోని పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్​ రంగనాథ్ (Hydra Commissioner Ranganath)​ పరిశీలించారు. నాలాల్లో వ‌ర‌ద సాఫీగా సాగుతుందా లేదా.. ఎక్క‌డైనా ఆటంకాలున్నాయా అనే అంశాల‌ను ప‌రిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు.

దుర్గం చెరువు (Durgam Cheruvu)కు ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉండదని, వర్షాకాలంలో నీటి నిల్వ స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే తమ కాలనీల్లో నిలిచి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కమిషనర్​కు విన్నవించారు. దీంతో దుర్గం చెరువులో నీటిమట్టం నిర్వ‌హ‌ణ‌పై ఇరిగేష‌న్‌, జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ అధికారుల‌తో త్వరలో సమావేశం నిర్వహించాలని హైడ్రా క‌మిష‌న‌ర్ నిర్ణ‌యించారు.

Hydraa | ఆక్రమణల పరిశీలన

దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు.. వ‌ర‌ద కాలువ‌కు ఉన్న ఆటంకాల‌ను కూడా కమిషనర్​ రంగనాథ్​ ప‌రిశీలించారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) వైపు మట్టి పోయడంపై విచారించారు. అక్క‌డ పార్కు చేసిన వాహనాలకు సంబంధించి వాక‌బు చేశారు. పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే వరదల నియంత్రణకు హైడ్రా చర్యలు చేపడుతుండడంతో కాల్వలు, నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు ఆందోళన చెందుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...