Hydraa | రూ.300 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | బాచుపల్లిలో (Bachupally) 2.30 ఎకరాల పార్కు భూమిని హైడ్రా (Hydraa) కాపాడింది. సదరు భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) బచుపల్లి మండలంలో ప్రజల కోసం పార్కుకు కేటాయించిన 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సిబ్బంది మంగళవారం కాపాడారు. అలాగే ఎంఆర్‌వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల నుంచి విముక్తి కల్పించి స్వాధీనం చేసుకుంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | బాచుపల్లిలో (Bachupally) 2.30 ఎకరాల పార్కు భూమిని హైడ్రా (Hydraa) కాపాడింది. సదరు భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) బచుపల్లి మండలంలో ప్రజల కోసం పార్కుకు కేటాయించిన 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సిబ్బంది మంగళవారం కాపాడారు. అలాగే ఎంఆర్‌వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల నుంచి విముక్తి కల్పించి స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్లు 142, 143 మరియు 144లో ఉన్న 2.30 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ 2016లో అధికారికంగా పార్కు అభివృద్ధి కోసం కేటాయించారు. అనంతరం పార్క్​ను అభివృద్ధి చేశారు.

Hydraa | ప్రజావాణి ఫిర్యాదుతో..

కొందరు ప్రైవేట్ వ్యక్తులు 2023లో ఆ భూమిని తమ ఆస్తిగా పేర్కొంటూ, మొక్కలను ధ్వంసం చేసి, నర్సరీని తొలగించారు. రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మించారు. దీనిపై ఇటీవల స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ భూమిని పార్కు భూమిగా కేటాయించినట్లు నిర్ధారించి, కబ్జాలను తొలగించారు. ఆ భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. అదే సర్వే నంబర్లలో ఎంఆర్‌ఓ కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల భూమి కూడా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. హైడ్రా కబ్జాలను తొలగించి, భూమి చుట్టూ కంచె వేసింది. పార్క్​ స్థలాన్ని కాపాడటంతో స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...