Hydraa | మురుగు సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన హైడ్రా కమిషనర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని హిమాయ‌త్‌న‌గ‌ర్ ఆద‌ర్శ‌న‌గ‌ర్ బ‌స్తీ ప‌రిస‌రాల్లో 30 ఏళ్ల మురుగు స‌మ‌స్య‌ను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner)​ రంగనాథ్​ ఆదేశించారు. బస్తీలో మంగళవారం ఆయన పర్యటించారు. మురుగు నీరు సాఫీగా వెళ్ల‌క‌.. ఇళ్ల‌లోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేర‌డం, నాలాల్లో క‌ల‌వ‌డంతో తాగు నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్​ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వంద‌డ‌గుల దూరంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని హిమాయ‌త్‌న‌గ‌ర్ ఆద‌ర్శ‌న‌గ‌ర్ బ‌స్తీ ప‌రిస‌రాల్లో 30 ఏళ్ల మురుగు స‌మ‌స్య‌ను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner)​ రంగనాథ్​ ఆదేశించారు. బస్తీలో మంగళవారం ఆయన పర్యటించారు.

మురుగు నీరు సాఫీగా వెళ్ల‌క‌.. ఇళ్ల‌లోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేర‌డం, నాలాల్లో క‌ల‌వ‌డంతో తాగు నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్​ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వంద‌డ‌గుల దూరంలో హుస్సేన్‌సాగ‌ర్ నాలా ఉండ‌గా.. మురుగుతో పాటు వ‌ర్షం ప‌డిన‌ప్పుడు వ‌ర‌ద‌ ముంచెత్త‌డానికి గ‌ల కార‌ణాలను తెలుసుకున్నారు. హిమాయ‌త్‌న‌గ‌ర్‌పై నుంచి వ‌చ్చే మురుగు, వ‌ర‌ద నీరు త‌మ ప్రాంతాల‌ను ముంచెత్తుతోంద‌ని ఆద‌ర్శ‌న‌గ‌ర్ బ‌స్తీ వాసులు తెలిపారు.

Hydraa | పనులు ప్రారంభించాలి

మురుగు సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్​ హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగ‌ర్ (Hussain Sagar) నాలా వ‌ర‌కూ ప‌నులు పూర్తి స్థాయిలోనే చేప‌డ‌తామ‌ని చెప్పారు. మురుగు, వ‌ర‌ద నీరు ఎటువైపు వాలుగా వెళ్తుందో ప‌రిశీలించి వెంట‌నే ప‌నులు మొద‌లు పెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 6 మీట‌ర్ల మేర కొన్ని పైపు లైన్లు దెబ్బ‌తిన్నాయ‌ని.. వాటిని మార్చాలని జ‌ల‌మండ‌లి అధికారులు వివ‌రించారు. పై నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌, మురుగు నీటిని అంచ‌నా వేసి.. పెద్ద పైపులు వేయాల‌ని కమిషనర్​ సూచించారు. హుస్సేన్ సాగ‌ర్ రిటైనింగ్ వాల్ కూడా 35 మీట‌ర్ల మేర దెబ్బ‌తిందని, దానిని కూడా పూర్తి చేయాల‌ని సూచించారు. హైడ్రా డీఎఫ్‌వో య‌జ్జ‌నారాయ‌ణ, జ‌ల‌మండ‌లి డీజీఎం కృష్ణ‌య్య‌, జీహెచ్ఎంసీ డీఈ ప్ర‌వీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...