Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | భార్య కాపురానికి రావట్లేదని సెల్​టవర్ ఎక్కిన భర్త

Yellareddy | భార్య కాపురానికి రావట్లేదని సెల్​టవర్ ఎక్కిన భర్త

భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్​టవర్​ ఎక్కాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్​టవర్​ ఎక్కాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy Town) శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే పవన్​కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆర్నెళ్లుగా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన పవన్​ పట్టణంలోని సెల్​టవర్​ (cell tower) ఎక్కాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పవన్​ను బుజ్జగించి సెల్​టవర్​ పైనుంచి కిందికి దింపారు.

Must Read
Related News