Nizamabad city | మంటగలిసిన మానవత్వం.. నడిరోడ్డుపై హత్య జరిగినా పట్టించుకోని జనం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు..’ అని రచయిత అందెశ్రీ రాసినట్లుగా నేటి సమాజం తయారైంది. తోటి మనిషి ఆపదలో ఉన్నా ఆదుకునే వాడే కరువయ్యాడు. మానవత్వం మంటగలిసిపోయిందనడానికి సజీవ సాక్షమే.. నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) జరిగిన హత్యోదంతం. నగరం నడిబొడ్డున ఓ కానిస్టేబుల్‌ (constable) దారుణహత్యకు గురయ్యాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేసి నడి రోడ్డుపై జనాలు చూస్తుండగానే కానిస్టేబుల్​ను పొడిచి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు..’ అని రచయిత అందెశ్రీ రాసినట్లుగా నేటి సమాజం తయారైంది. తోటి మనిషి ఆపదలో ఉన్నా ఆదుకునే వాడే కరువయ్యాడు. మానవత్వం మంటగలిసిపోయిందనడానికి సజీవ సాక్షమే.. నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) జరిగిన హత్యోదంతం.

నగరం నడిబొడ్డున ఓ కానిస్టేబుల్‌ (constable) దారుణహత్యకు గురయ్యాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేసి నడి రోడ్డుపై జనాలు చూస్తుండగానే కానిస్టేబుల్​ను పొడిచి చంపాడు. అయినప్పటికీ ఘటనా స్థలంలో గుమిగూడిన జనం ఏ ఒక్కరూ కూడా అడ్డుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు ఈ దృశ్యాన్ని వీడియోలు తీస్తూ నిల్చుండిపోయారే తప్ప.. పోలీసులు సాయం కోరినా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించడానికి కూడా సహకరించకుండా మానవత్వాన్ని మరిచారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న వినాయక్‌నగర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన కానిస్టేబుల్​ హత్యోదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిజామాబాద్‌ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్‌ (Riyaz) పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతడిని అరెస్ట్‌ చేసేందుకు శుక్రవారం రాత్రి కానిస్టేబుల్‌ ప్రమోద్‌, సహచర సిబ్బందితో కలిసి వెళ్లాడు.

నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని స్టేషన్​కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో కానిస్టేబుల్​పై నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. సీసీఎస్‌ ఎస్సై విఠల్‌ (CCS SI Vitthal) ఆస్పత్రికి తరలించగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ అంశం ప్రస్తుతం పోలీస్​ శాఖతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

Nizamabad city | చోద్యం చూసిన జనం.. సీపీ ఆవేదన

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న జనం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సైతం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనా స్థలంలో జనం వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

‘దాడి జరిగిన సమయంలో పోలీసులు సాయం కోరితే ఎవరూ ముందుకు రాలేదు. జనం పక్కనే ఉండి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారే తప్ప ఏ ఒక్కరూ సాయం చేయలేదు. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఆటోవాలాలూ సహకరించలేదు. పోలీసు అనే కాదు ఎవరైనా సరే ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం సరైందికాదు. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేయకుండా వదిలేసి వెళ్తే.. సొసైటీ ఎలా ముందుకు వెళ్తుందని’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...