Homeఅంతర్జాతీయంPakistan | పాకిస్తాన్​లో భారీ బాంబు పేలుడు.. 13 మంది మృతి

Pakistan | పాకిస్తాన్​లో భారీ బాంబు పేలుడు.. 13 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | పాకిస్తాన్​లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని ఫ్రాంటియర్‌ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో ఈ ఘటన చేసుకుంది.

బలూచిస్థాన్‌(Balochistan)లోని క్వెట్టా నగరంలో పారామిలిటరీ బలగాలకు చెందిన ఫ్రాంటియర్‌ కోర్ కార్యాలయం సమీపంలో పేలుళ్లు జరగడం గమనార్హం. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అనంతరం వెంటనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.

Pakistan | కారు బాంబుతో..

పేలుడు పదార్థాలతో నిండిన కారు ఫ్రాంటియర్‌ కోర్ (Frontier Core) సమీపంలో మలుపు తీసుకుంటుండగా.. పేలుడు సంభవించిందని క్వెట్టా ప్రత్యేక కార్యకలాపాల SSP ముహమ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, 32 మంది గాయపడ్డారు. పేలుడు చాలా శక్తివంతంగా ఉండడంతో మోడల్ టౌన్, పరిసర ప్రాంతాల వరకు శబ్ధం వినిపించింది. ఆ వెంటనే ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దం కూడా వినిపించింది. రెస్క్యూ బృందాలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బలూచిస్తాన్​లో ఆందోళన చేస్తున్న ప్రజలపై ఇటీవల పాక్​ సైన్యం (Pakistan Army) కాల్పులు జరిపింది. ఎక్కడిక్కడ నిరసనలను అణచివేయడానికి భారీగా బలగాలను మోహరించింది. ఈ క్రమంలో తాజాగా పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దీనిని బాధ్యత తీసుకోలేదు.