Tamil Nadu | బీమా డబ్బుల కోసం ఘోరం.. పాముతో కరిపించి తండ్రి హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది. బీమా డబ్బుల (insurance money) కోసం కన్న తండ్రిని ఇద్దరు కుమారులు హత్య చేశారు. ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగింది. డబ్బు, ఆస్తుల కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. కన్నవారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటు చేసుకుంది. తండ్రి పేరిట బీమా చేయించిన ఇద్దరు కుమారులు, ఆయనున పాము కాటుతో చంపించారు. ఇన్సూరెన్స్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది. బీమా డబ్బుల (insurance money) కోసం కన్న తండ్రిని ఇద్దరు కుమారులు హత్య చేశారు.

ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగింది. డబ్బు, ఆస్తుల కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. కన్నవారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటు చేసుకుంది. తండ్రి పేరిట బీమా చేయించిన ఇద్దరు కుమారులు, ఆయనున పాము కాటుతో చంపించారు. ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Tamil Nadu | రూ.3 కోట్ల బీమా చేయించి

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు (Tiruvallur district) చెందిన గణేశన్ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్​ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఆయనపై రూ.3 కోట్ల బీమా (insurance policy) చేయించారు. తండ్రిని హత్య చేసి బీమా డబ్బులు సొంతం చేసుకోవాలని ప్లాన్​ వేశారు. తమ మీద అనుమానం రాకుండా హత్య చేయాలని ప్లాన్​ వేశారు. ఈ క్రమంలో ఓ సారి పామును తీసుకొచ్చి తన తండ్రి ఉన్న గదిలో విడిచి పెట్టారు. అయితే అది విషపూరితమైనది కాకపోవడంతో గణేశన్​ ప్రాణాలతో బయటపడ్డారు. మరోసారి అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి నిద్రిస్తున్న వారి తండ్రి మెడపై కాటు వేయించారు. తమ మీద అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు పాము కాటు వేసిందని నమ్మించారు. పామును అక్కడే చంపారు.

Tamil Nadu | ఇలా దొరికారు

తండ్రి మరణం తర్వాత బీమా డబ్బుల కోసం ఇన్సూరెన్స్​ కంపెనీని ఆశ్రయించారు. క్లెయిమ్ ప్రాసెస్​ చేస్తున్న సమయంలో కంపెనీ ప్రతినిధులు గణేశన్​పై అనేక బీమా పాలసీలు ఉండటం గమనించారు. దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు కుమారులు కలిసి తండ్రిని చంపినట్లు గుర్తించారు. పాము కాటు తర్వాత కావాలనే తండ్రిని ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారని చెప్పారు. దీంతో గణేశన్​ మృతి చెందాడు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు మృతుడి ఇద్దరు కుమారులతో సహా వారికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్​ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...