Heatwaves | హై అలెర్ట్.. నేడు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం

అక్షరటుడే, హైదరాబాద్: Heatwaves : తెలంగాణపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంపై వడగాలుల ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమురం భీం, నిజామాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. మరో 21 జిల్లాలు ఆరెంజ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నాయి. వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని […]

అక్షరటుడే, హైదరాబాద్: Heatwaves : తెలంగాణపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంపై వడగాలుల ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమురం భీం, నిజామాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది.

మరో 21 జిల్లాలు ఆరెంజ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నాయి. వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరింది.

ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. గురువారం నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీమ్​, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...