అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో దిగువకు నీటి విడుదలను పెంచారు. జలాశయం నుంచి మంజీరలోకి లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు. నిజాంసాగర్ దిగువన మంజీర పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నది సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.