Phone Tapping Case | నేడు సిట్​ ముందుకు హరీశ్​రావు.. బీఆర్​ఎస్​లో టెన్షన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో హరీశ్​రావును సిట్​ అధికారులు నేడు విచారించనున్నారు. దీంతో బీఆర్​ఎస్​ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్​ఎస్​ హయాంలో పలువురి ఫోన్లను ట్యాప్​ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే కేసు నమోదు కాగా.. ఇటీవల ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్​ అధికారులు (SIT Officers) విచారణ వేగవంతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో హరీశ్​రావును సిట్​ అధికారులు నేడు విచారించనున్నారు. దీంతో బీఆర్​ఎస్​ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్​ఎస్​ హయాంలో పలువురి ఫోన్లను ట్యాప్​ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే కేసు నమోదు కాగా.. ఇటీవల ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్​ అధికారులు (SIT Officers) విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావును కస్టడీకి తీసుకొని విచారించారు. ఇటీవల బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ నవీన్​రావును విచారించారు. అలాగే ఆయన తండ్రి, కూకట్​పల్లి ఎమ్మెల్యే కుమారుడికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సోమవారం సాయంత్రం హరీశ్​రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారు.

Phone Tapping Case | హరీశ్​రావు నివాసానికి కేటీఆర్​

సిట్​ విచారణ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో హరీశ్​ రావు సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ (Jubilee Hills PS)​లో విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో హరీశ్​ రావు పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​లోని హరీశ్​రావు నివాసానికి కేటీఆర్ (KTR) చేరుకున్నారు. లీగల్ టీమ్​తో సంప్రదింపులు కేటీఆర్, హరీశ్​రావు సంప్రదింపులు జరుపుతున్నారు. సిట్ విచారణలో విచారణలో ఏ అంశాలు మాట్లాడాలి అనేదానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.హరీశ్​రావుకు నోటీసులు అందించడంతో బీఆర్​ఎస్​ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయం మేరకు ఫోన్​ ట్యాప్​ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో హరీశ్​రావు, కేసీఆర్​కు నోటీసులు వస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సిద్ధం అవుతున్న తరుణంలో ఆయనను విచారణకు పిలవడం గమనార్హం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...