Harish Rao | కేసీఆర్​తో హరీశ్​రావు భేటీ.. సిట్​ విచారణపై చర్చ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ (KCR)తో మాజీ మంత్రి హరీశ్​రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ (SIT investigation) వివరాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ అధికారులు దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం హరీశ్​రావును ఏడు గంటల పాటు చర్చించారు. తన కుమారుడు అమెరికాకు వెళ్తున్నాడని చెప్పడంతో విచారణ త్వరగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ (KCR)తో మాజీ మంత్రి హరీశ్​రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ (SIT investigation) వివరాలను ఆయనకు వివరించారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ అధికారులు దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం హరీశ్​రావును ఏడు గంటల పాటు చర్చించారు. తన కుమారుడు అమెరికాకు వెళ్తున్నాడని చెప్పడంతో విచారణ త్వరగా ముగించినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని సైతం పేర్కొన్నారు. ఈ క్రమంలో సిట్​ విచారణపై హరీశ్​రావు కేసీఆర్​తో చర్చించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై చర్చించినట్లు సమాచారం.

Harish Rao | కొలిక్కి వచ్చేనా..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు ఎంతకు కొలిక్కి రావడం లేదు. కేసు నమోదు అయి రెండేళ్లు కావొస్తుంది. అయినా కానీ విచారణ సాగుతూనే ఉంది. ఇటీవల ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ సీపీ (Hyderabad CP) సజ్జనార్​ నేతృత్వం వహిస్తున్నారు. సిట్​ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావుతో పాటు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ నవీన్​రావు, ఓ ఛానెల్​ మాజీ ఎండీ శ్రవణ్​రావును విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీశ్​రావును ప్రశ్నించినట్లు సమాచారం.

విచారణలో భాగంగా సిట్​ అధికారులు హరీశ్​రావుకు షాకింగ్ న్యూస్​ చెప్పినట్లు తెలిసింది. ఆయన ఫోన్​ను కూడా ట్యాప్​ చేశారని తెలిపినట్లు సమాచారం. హరీశ్​రావుతో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్​ చేశారని, ఆ వివరాలను హరీశ్​రావు ముందు సిట్​ అధికారులు ఉంచినట్లు సమాచారం.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...