Harish Raana | 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన కొడుకు.. కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Raana | గత 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీకి (Delhi) చెందిన హరీశ్ రాణా తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తుది నిర్ణయం వెలువరించనుంది. 2018లో పాసివ్ యుథనేసియాను చట్టబద్ధం చేసిన తర్వాత, ఈ అంశంపై వచ్చే అత్యంత కీలకమైన తీర్పుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో (Chandigarh University) సివిల్ ఇంజనీరింగ్ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Raana | గత 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీకి (Delhi) చెందిన హరీశ్ రాణా తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తుది నిర్ణయం వెలువరించనుంది.

2018లో పాసివ్ యుథనేసియాను చట్టబద్ధం చేసిన తర్వాత, ఈ అంశంపై వచ్చే అత్యంత కీలకమైన తీర్పుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో (Chandigarh University) సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో హరీశ్ రాణా పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతడికి మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో 100 శాతం అశక్తుడిగా మారాడు. అప్పటి నుంచి అతడు కళ్లు తెరవలేకపోవడం, అవయవాలు కదపలేకపోవడం, ట్యూబుల సహాయంతోనే శ్వాస తీసుకుంటూ, ఆహారం పొందుతూ మృతప్రాయంగా జీవిస్తున్నాడు.

Harish Raana | నేడే తీర్పు..

కొడుకు చికిత్స కోసం హరీశ్ తల్లిదండ్రులు Parents తమ ఆస్తిని అమ్ముకోవాల్సిన స్థితికి చేరి, ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యారు. ఇలాంటి నరకప్రాయమైన జీవితం నుంచి కుమారుడిని విముక్తం చేయాలని భావించిన తల్లిదండ్రులు 2024లో మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హరీశ్ వెంటిలేటర్‌పై లేడనే కారణంతో అప్పట్లో కోర్టు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసు తీవ్రతను గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు తన నివేదికలో హరీశ్ కోలుకునే అవకాశం లేదని, అతడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్పష్టం చేసింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం హరీశ్ (Harish) తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకుంది. “ఈ బాలుడిని ఇలాంటి స్థితిలో కొనసాగించలేం” అని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించి హరీశ్‌కు గౌరవప్రదంగా మరణించే హక్కు కల్పిస్తుందా లేదా అన్న అంశంపై వచ్చే తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. గమనార్హంగా, కారుణ్య మరణంపై దేశంలో న్యాయ చర్చ 2011లో అరుణా షాన్‌బాగ్ కేసుతో మొదలైంది. ఆ తర్వాత 2018లో సుప్రీంకోర్టు “గౌరవప్రదంగా మరణించడం కూడా జీవించే హక్కులో భాగమే” అని వ్యాఖ్యానిస్తూ పాసివ్ యుథనేసియాను చట్టబద్ధం చేసింది. ఇప్పుడు హరీశ్ రాణా కేసులో వచ్చే తీర్పు ఆ న్యాయ సూత్రాలకు మరింత స్పష్టత తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...