Haridwar | హరిద్వార్‌లో ఘాట్‌ల వద్ద “అహిందూ ప్రవేశ్ నిషేధ్ క్షేత్ర” బోర్డుల ఏర్పాటు.. తీవ్ర చర్చ..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Haridwar | దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన హరిద్వార్‌లో (Haridwar) హర్ కీ పౌరీ ఘాట్‌ పరిసరాల్లో తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఘాట్‌ల నిర్వహణ బాధ్యతలు చూసే శ్రీ గంగాసభ (Shri Ganga Sabha) ఆధ్వర్యంలో, హర్ కీ పౌరీకి వెళ్లే ప్రధాన మార్గాలు, వంతెనలు, స్తంభాలపై “అహిందూ ప్రవేశ్ నిషేధ్ క్షేత్ర” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Haridwar | దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన హరిద్వార్‌లో (Haridwar) హర్ కీ పౌరీ ఘాట్‌ పరిసరాల్లో తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఘాట్‌ల నిర్వహణ బాధ్యతలు చూసే శ్రీ గంగాసభ (Shri Ganga Sabha) ఆధ్వర్యంలో, హర్ కీ పౌరీకి వెళ్లే ప్రధాన మార్గాలు, వంతెనలు, స్తంభాలపై “అహిందూ ప్రవేశ్ నిషేధ్ క్షేత్ర” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గంగా నదికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించడమే తమ లక్ష్యమని గంగాసభ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతం శతాబ్దాలుగా హిందూ విశ్వాసాలకు కేంద్రబిందువుగా ఉందని, పవిత్రతకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని గంగాసభ అధ్యక్షుడు నితిన్ గౌతమ్ వివరించారు.

Haridwar | హ‌రిద్వార్‌లో వెలిసిన బోర్డులు..

1916 నాటి హరిద్వార్ మున్సిపల్ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ఆ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తమ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కొందరు సందర్శకుల ప్రవర్తన సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయిన కొన్ని వీడియోలు, వేషధారణలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గంగాసభ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే, ఈ నిర్ణయంపై ప్రభుత్వ స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh) ఈ అంశంపై స్పందిస్తూ, గంగాసభతో పాటు వివిధ మత పెద్దలు, అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.

చట్టపరమైన అంశాలు, రాజ్యాంగ పరమైన పరిమితులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అందేవరకు తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాబోయే 2027 అర్ధకుంభమేళా దృష్ట్యా హరిద్వార్‌లోని మొత్తం 105 ఘాట్‌లలో ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని గంగాసభ (Ganga Sabha) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, హరిద్వార్‌లో ఘాట్‌ల నిర్వహణ, సందర్శకుల నియంత్రణ విషయంలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...