Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్​కు భూమిపూజ

అక్షరటుడే, కోటగిరి : Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు దేశంలో ఎక్కడా లేవని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పోతంగల్ మండలంలోని పీఎస్​ఆర్​ నగర్​లో స్కూల్​ నిర్మాణానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేశ్​ షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో (Kasula Balaraj) కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పాఠశాల భవన (school building) నిర్మాణం […]

అక్షరటుడే, కోటగిరి : Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు దేశంలో ఎక్కడా లేవని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పోతంగల్ మండలంలోని పీఎస్​ఆర్​ నగర్​లో స్కూల్​ నిర్మాణానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేశ్​ షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో (Kasula Balaraj) కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పాఠశాల భవన (school building) నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజురయ్యాయన్నారు. అన్ని వసతులతో కూడిన పాఠశాల భవనం నిర్మించబోతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్​ స్కూల్​లో విద్యార్థులు మూడు వేల మంది పిల్లలు చదువుతారన్నారు. అందులో క్రికెట్, వాలీబాల్ గ్రౌండ్, విశాలమైన భవనాలు రోడ్లు, ఉంటాయని వివరించారు.

ఎంపీ సురేశ్​​ షెట్కార్​ (MP Suresh Shetkar) మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు ఇవ్వాలని ఉద్దేశంతో మారుమూల గ్రామంలో పీఎస్ఆర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు.

కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma houses), ఇందిరమ్మ చీరలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు​ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. డ్వాక్రా, మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), డీఈ రవి, ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్​ హన్మంత్, తహశీల్దార్ గంగాధర్, కోటగిరి ఎంపీడీవో విష్ణు, చందర్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మధుసూదన్​, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, కేశ వీరేశం, అనంత విఠల్, గంట్ల విఠల్, బర్ల మధు, హంగర్గ గంగాధర్, నాగరాజ్ గౌడ్, మానిక్ అప్ప, పోచిరాం, మాధవరావు పటేల్, రాంబాబు, జగన్, ధన్​రాజ్, రాజు, చిన్న, దత్తు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...