Harish Rao | జర్నలిస్టులపై ప్రభుత్వం కక్ష సాధింపు : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. పాలన చేతగాక పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్​లో ఐఏఎస్​ అధికారిణి (IAS Officer)పై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. సదరు ఛానెల్​ ఇన్​పుట్​ ఎడిటర్​ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. పాలన చేతగాక పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటన్నారు.

ఇటీవల ఓ టీవీ ఛానెల్​లో ఐఏఎస్​ అధికారిణి (IAS Officer)పై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. సదరు ఛానెల్​ ఇన్​పుట్​ ఎడిటర్​ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం ప్రసారమైన కథనంపై సదరు ఛానెల్​ యాజమాన్యం క్షమాపణలు సైతం చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం జర్నలిస్టులను (Journalists) అరెస్ట్​ చేసింది. దీనిపై బుధవారం మంత్రి హరీశ్​రావు స్పందించారు.

Harish Rao | జర్నలిస్టులను బలి చేస్తారా

మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అన్నారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను ఆయన ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) చేస్తున్న దాడి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) దాడి చేస్తోందని విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్​లు ఏర్పాటు చేసి ఎవరిని కాపాడుతున్నారని ప్రశ్నించారు.

Harish Rao | తక్షణం విడుదల చేయాలి

అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ విషయమై ఆయన డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అన్నారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...