Shabbir Ali | మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి పట్టణ సుందరీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) విద్యానగర్ కాలనీ, చోటా కసాబ్ గల్లీలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం […]

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి పట్టణ సుందరీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) విద్యానగర్ కాలనీ, చోటా కసాబ్ గల్లీలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యానగర్ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకల సమస్యలు తొలగి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. చోటా కసాబ్ గల్లీ ప్రాంతం ఎన్నాళ్లుగానో మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని.. పట్టణం అయినా, గ్రామమైనా సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి మార్గదర్శకమని చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ప్రాంతాలను గుర్తించి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

Shabbir Ali | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 82 మంది బాధిత కుటుంబాలకు రూ.50లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం బారినపడి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ కాగానే సంబంధిత బిల్లు ఒరిజినల్ పత్రాలు పార్టీ కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని తెలిపారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...