Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై గుడ్​న్యూస్​.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మొదటి దశలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపడుతున్నారు. కొందరు లబ్ధిదారుల ఇళ్లు పూర్తికావడంతో గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పట్టణ ప్రాంతంలో సైతం ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మొదటి దశలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపడుతున్నారు. కొందరు లబ్ధిదారుల ఇళ్లు పూర్తికావడంతో గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పట్టణ ప్రాంతంలో సైతం ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మూడేళ్లలో పల్లెలతో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

పట్టణాల్లో స్థల కొరత దృష్ట్యా జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని చెప్పారు. ఏప్రిల్​ నాటికి రెండో విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు.

Indiramma Houses | తప్పు చేస్తే శిక్ష తప్పదు

ప్రజా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని మంత్రి పొంగులేటి అన్నారు. పొంగులేటి కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దానిపై ఆయన స్పందించారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తారన్నారు. తప్పు చేస్తే తన కొడుకైనా, తానైనా శిక్ష పడుతుందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...