Malaysia | మలేషియాలో చిక్కుకున్న కార్మికులకు గుడ్​న్యూస్​.. ఇళ్లకు పంపే చర్యలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malaysia | మలేషియా ప్రభుత్వం మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM2.0) ప్రారంభించినట్లు మలేషియాలోని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ (FNCA) తెలిపింది. డాక్యుమెంట్ లేని వలస కార్మికులకు జైలు శిక్ష, భారీ జరిమానాలను ఎదుర్కోకుండా చట్టబద్ధంగా సురక్షితంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగ పడుతుందన్నారు. భారత్​కు చెందిన ఎంతో మంది కార్మికులు మలేషియాలో చిక్కుకుపోయారు. ఇందులో అధిక సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malaysia | మలేషియా ప్రభుత్వం మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM2.0) ప్రారంభించినట్లు మలేషియాలోని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ (FNCA) తెలిపింది. డాక్యుమెంట్ లేని వలస కార్మికులకు జైలు శిక్ష, భారీ జరిమానాలను ఎదుర్కోకుండా చట్టబద్ధంగా సురక్షితంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగ పడుతుందన్నారు.

భారత్​కు చెందిన ఎంతో మంది కార్మికులు మలేషియాలో చిక్కుకుపోయారు. ఇందులో అధిక సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో చాలా మంది ఏజెంట్లచేత మోసపోయి, విజిట్ వీసాలపై మలేషియాకు వచ్చి, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా చిక్కుకుపోయారు.

Malaysia | రూ.10 వేలు చెల్లించి..

పీఆర్ఎం 2.0 కార్యక్రమం 2025 మే 19 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా డాక్యుమెంట్ లేని కార్మికులు నామమాత్రమైన జరిమానా RM 500 (సుమారు రూ.10వేలు) చెల్లించడం ద్వారా తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేని వారు మలేషియాలోని భారత హై కమిషన్ (High Commission of India) నుంచి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్‌లను పొందడం ద్వారా తిరిగి స్వదేశానికి వెళ్లవచ్చు.

Malaysia | అండగా ఆ సంస్థలు

మలేషియాలో చిక్కుకున్న భారతీయులకు ఎఫ్‌ఎన్‌సీఏ-మలేషియా, తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వంటి సంస్థలు అండగా నిలుస్తున్నారు. ఈ అమ్నెస్టీ ప్రక్రియ ద్వారా బాధిత కార్మికులు స్వదేశానికి వెళ్లేలా ఈ సంస్థలు మార్గనిర్దేశం చేస్తున్నాయి.

Malaysia | ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి

మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 గురించి తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కల్పించాలని ఎఫ్ఎన్​సీఏ కోరింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) మలేషియాలో పర్యటించిన సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి దీనిపై లేఖ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం గురించి వివరించి బాధితులు ఇళ్లకు చేరేలా సాయం చేయాలని కోరారు.

కార్మికుల సురక్షిత రిటర్న్‌ను నిర్ధారించడానికి సమన్వయ ప్రయత్నాల అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గడువు ముగిసే లోపు బాధిత వ్యక్తులు, వారి కుటుంబాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం, భారత హై కమిషన్, సముదాయ సంస్థల మధ్య సహకారం ద్వారా ఈ కార్మికులను వారి స్వస్థానాలకు పంపే ఏర్పాటును సులభతరం చేయాలని కోరారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...