Union Cabinet | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఐదు ఐఐటీల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అక్షరటుడే, న్యూఢిల్లీ: Union Cabinet : దేశంలో ఐదు ఐఐటీల (IITs) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని ఐఐటీ తిరుపతి (IIT Tirupati), కేరళలోని ఐఐటీ పాలక్కాడ్ (IIT Palakkad), ఛత్తీస్‌గఢ్‌లోని ఐఐటీ భిలాయ్ (IIT Bhilai), జమ్మూకశ్మీర్‌లోని ఐఐటీ జమ్మూ (IIT Jammu), కర్ణాటకలోని ఐఐటీ ధార్వాడ్‌ (IIT Dharwad) విస్తరణకు మార్గం సుగమమైంది. ఐఐటీల విస్తరణను “ఫేజ్-బీ నిర్మాణం” (Phase-B structure) పేరుతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Union Cabinet : దేశంలో ఐదు ఐఐటీల (IITs) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని ఐఐటీ తిరుపతి (IIT Tirupati), కేరళలోని ఐఐటీ పాలక్కాడ్ (IIT Palakkad), ఛత్తీస్‌గఢ్‌లోని ఐఐటీ భిలాయ్ (IIT Bhilai), జమ్మూకశ్మీర్‌లోని ఐఐటీ జమ్మూ (IIT Jammu), కర్ణాటకలోని ఐఐటీ ధార్వాడ్‌ (IIT Dharwad) విస్తరణకు మార్గం సుగమమైంది.

ఐఐటీల విస్తరణను “ఫేజ్-బీ నిర్మాణం” (Phase-B structure) పేరుతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ₹11,828.79 కోట్లు కేటాయించింది. ఈ విస్తరణ పనులు 2028-29 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా కొత్తగా 130 ప్రొఫెసర్ స్థాయి (లెవల్-14 పైగా) పోస్టులు మంజూరుకానున్నాయి.

ఐదు ఆధునిక పరిశోధనా పార్కులు (modern research parks) నెలకొల్పుతారు. వీటి ఏర్పాటు పరిశ్రమ – విశ్వవిద్యాలయ భాగస్వామ్యాన్ని (industry-university partnerships) బలపర్చేందుకు దోహదపడుతుంది. ఈ విస్తరణతో సదరు ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరిగేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి సంవత్సరం 1,364 మంది, రెండో సంవత్సరం 1,738, మూడవ సంవత్సరం 1767, నాలుగో సంవత్సరం 1,707 సీట్ల మంజూరుతో కొత్తగా మొత్తం 6,576 మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందుకునే అవకాశం లభించబోతోంది. అంటే ప్రస్తుతం 7,111 మంది ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 13,687 మంది విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్య అందబోతోంది.

ఈ విస్తరణ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వారి నైపుణ్యాలు పెంచడం, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశోధన, స్టార్టప్‌లు, పెంచడం వంటి వాటి అభివృద్ధికి దోహదపడుతుంది.

ఈ ఐదు ఐఐటీలను 2015 తర్వాత స్థాపించారు. ఐఐటీ పాలక్కాడ్​ (IIT Palakkad), ఐఐటీ తిరుపతి (IIT Tirupati) 2015-16లో ప్రారంభించారు. ఐఐటీ భిలాయ్ (IIT Bhilai), జమ్మూ, ధార్వాడ్‌ (IIT Dharwad) 2016-17లో మొదలయ్యాయి. ప్రారంభంలో తాత్కాలిక క్యాంపస్​లలో కొనసాగించారు. ఇప్పుడు ఇవి శాశ్వత భవనాల్లోకి మారాయి.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...