Sabarimala Yatra | అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్​.. ఇరుముడితో విమాన ప్రయాణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala Yatra | అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇరుముడితో విమాన ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ప్రకటన చేశారు. అయ్యప్ప స్వాములు (Ayyappa Swamulu) ఇరుముడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. 41 రోజులు కఠిన దీక్ష చేపట్టి ఇరుముడితో శబరిమల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala Yatra | అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇరుముడితో విమాన ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ప్రకటన చేశారు.

అయ్యప్ప స్వాములు (Ayyappa Swamulu) ఇరుముడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. 41 రోజులు కఠిన దీక్ష చేపట్టి ఇరుముడితో శబరిమల (Sabarimala)కు వెళ్తారు. అయితే విమానాల్లో వెళ్లే స్వాములు ఇన్ని రోజులు ఇరుముడికి చెక్​ఇన్​ లగేజీ నిబంధన ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. భక్తుల ఇరుముడి ఉంచిన బ్యాగులను చెక్-ఇన్ ప్రక్రియలో షూస్ వేసుకున్న విమానాశ్రయ సిబ్బంది చెక్​ చేసేవారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీక్ష చేసిన స్వాములు సైతం ఇరుముడిని ఎత్తకూడదని, అలాంటిది షూస్​ వేసుకున్న సిబ్బంది ఇరుముడి (Irumudi) బ్యాగులను పట్టుకోవడం పవిత్రతకు భంగం కలిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Sabarimala Yatra | భక్తుల విజ్ఞప్తి మేరకు..

ఇరుముడి పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోఆరు. చెక్-ఇన్ బ్యాగేజీగా కాకుండా, క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​నాయుడు భక్తల విజ్ఞప్తి మేరకు విమాన ప్రయాణంలో ఇరుముడిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇరుముడిని చెక్‌ ఇన్‌ లగేజీగా పంపాలన్న నిబంధన తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ వెసులుబాటు జనవరి 20 వరకు వర్తిస్తుందని విమానయాన శాఖ (Aviation Department) తెలిపింది. దీంతో అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sabarimala Yatra | భద్రతా చర్యలు చేపడుతూనే..

అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడి పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భక్తులు ఇరుముడిని తమతోపాటు విమానంలో తీసుకెళ్లేలా అనుమతి ఇచ్చామన్నారు. అన్ని భద్రతా చర్యలు చేపడుతూనే.. భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టామన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...