Homeబిజినెస్​Today Gold Prices | కాస్త ఊర‌ట‌.. నిన్న‌టితో పోలిస్తే స్వ‌ల్పంగా పసిడి ధర త‌గ్గుద‌ల‌

Today Gold Prices | కాస్త ఊర‌ట‌.. నిన్న‌టితో పోలిస్తే స్వ‌ల్పంగా పసిడి ధర త‌గ్గుద‌ల‌

Today Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం Gold ధరలు పెరగడంతో భారత మార్కెట్‌పైనా స్పష్టమైన ప్రభావం పడింది. గ్లోబల్‌ Global స్థాయిలో పసిడి రేట్లు ఎగబాకడం, రూపాయి విలువ డాలర్‌ Dollar తో పోలిస్తే బలహీనపడటం కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధరలను మరింతగా పెంచాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్‌పైనా స్పష్టమైన ప్రభావం పడింది.

గ్లోబల్‌ స్థాయిలో పసిడి రేట్లు ఎగబాకడం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధరలను మరింతగా పెంచాయి.

పండుగ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం Gold కొనుగోళ్లకు ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం పసిడి ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి.

అక్టోబర్‌ 13, 2025 సోమవారం ఉదయం నాటికి 24 క్యారెట్‌ (24 carat) 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070గా న‌మోదైంది. 22 క్యారెట్‌ ఆభరణాల బంగారం (22 carat gold) ధర రూ.1,14,640గా నమోదు కాగా, 18 క్యారెట్‌ బంగారం ధర రూ.93,800గా ఉంది.

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ధరలు ఇంకా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

Today Gold Prices | స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

మరోవైపు వెండి ధర Silver కూడా కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,79,900గా ఉంది. పండుగ సీజన్‌లో డిమాండ్‌ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాల మార్పులు వంటి అంశాలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్‌పై కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ధరలు ఎగబాకడం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం వంటి అంశాలు దేశీయ బంగారం ధరలను మరింతగా పెంచాయి.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,220గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,790గా ఉంది.

చెన్నై (chennai) లో 24 క్యారెట్ బంగారం రూ.1,25,450, 22 క్యారెట్ రూ.1,14,990గా న‌మోదైంది. హైదరాబాద్‌, విజయవాడ‌, ముంబయి (Mumbai), బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ బంగారం రూ.1,25,070గా న‌మోదు కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,14,640గా ట్రేడ్ అయింది.

మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1,79,900గా ఉంది. హైదరాబాద్‌, కేరళ‌, చెన్నై నగరాల్లో వెండి ధర కిలోకు రూ.1,89,900గా నమోదైంది.

నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరత, జియోపొలిటికల్‌ ఉద్రిక్తతలు, అలాగే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ వలన బంగారం, వెండి ధరలు సమీప కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది.